మా గ్రామానికి ఆనుకుని స్టోన్ క్రషర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. పెద్ద బండరాళ్లను పేలుడు పదార్థాలతో పగులగొడుతుండటంతో భారీ శబ్దాలకు ఇళ్లలోని వస్తువులు కిందపడిపోతున్నాయి. దుమ్ము, ధూళి కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కంకర పొడి కారణంగా పంటలు బూడిదమయం అవుతున్నాయి. సంబంధిత ఏఎంఆర్ మైన్స్ను మూసివేయించి గ్రామస్తుల ఆరోగ్యాన్ని కాపాడాలి.
– చిన్న, యజ్దాని బాషా, సుబ్బరాయుడు, హజరత్తయ్య, అమీర్, ఆమనిచిరువెళ్ల,
అనంతసాగరం మండలం


