
ఇటీవల జరిగిన ఘటనలు
● పొట్టేపాళేనికి చెందిన ఓ యువకుడు నగరంలోని మందుల దుకాణంలో పనిచేస్తున్నాడు. పనిముగించుకుని ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అతడిని అడ్డగించి కత్తులతో బెదిరించి నగదు, బంగారు ఉంగరం దోచుకెళ్లారు.
● ఐపీఎల్ ఫైనల్స్ రోజు అర్ధరాత్రి కొందరు యువకులు మద్యం మత్తులో జాతీయ రహదారిపై వీరంగం చేశారు. వాహన రాకపోకలకు అంతరాయం కలిగించడంతోపాటు ప్రజలపై దౌర్జన్యం చేశారు.
● రంగనాయకులపేటకు చెందిన ఓ వ్యక్తిని చంపుతామని బెదిరించి రూ.1,500 దోచుకెళ్లారు.
● ముత్తుకూరు బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళను చంపుతామని బెదిరించి రెండు సెల్ఫోన్లను దోచుకెళ్లారు.
● మూడురోజుల క్రితం బీవీనగర్కు చెందిన ఓ యువకుడు ఇంటికి వెళుతుండగా మద్యం మత్తులో ఉన్న కొందరు అడ్డుకున్నారు. చంపుతామని బెదిరించి అతడి వద్దనున్న సెల్ఫోన్ను దోచుకెళ్లారు.