
132 మందికి ఉద్యోగాలు
నెల్లూరు (టౌన్): స్థానిక వెంకటేశ్వపురంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో బుధవారం క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ డ్రైవ్లో బాలికల ఐటీఐతోపాటు సంగం, ఏఎస్పేటల్లోని ప్రభుత్వ ఐటీఐలో చదువుతున్న 160 మంది విద్యార్థులు హాజరు కాగా రాత పరీక్ష, ఇంటర్వ్యూలు అనంతరం 132 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ ఏడుకొండలు తెలిపారు. ఈ డ్రైవ్లో బ్లూస్టార్, గ్రీన్టెక్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్, ఏంపినోల్ తదితర కంపెనీ ప్రతినిధులు హాజరైనట్లు చెప్పారు.
మరో ఇద్దరికి కరోనా
నెల్లూరు (అర్బన్): జిల్లాలో మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. కోవూరు పట్టణానికి చెందిన 40 ఏళ్ల మహిళ, నెల్లూరు నగరంలోని జెడ్పీ కాలనికీ చెందిన 60 ఏళ్ల విశ్రాంత అధికారి జ్వరం, జ్వరం, గొంతునొప్పి లక్షణాలతో బాధపడుతూ పెద్దాస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. వారికి బుధవారం కరోనా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో వారిని హోం ఐసోలేషన్లో ఉంచి వైద్యశాఖాధికారులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసులు 14కి చేరాయి.
కాకాణి బెయిల్
పిటిషన్పై తీర్పు రేపు
నెల్లూరు (లీగల్): పొదలకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ ఐదో అదనపు జిల్లా (ప్రత్యేక ఎస్సీ ఎస్టీ,)కోర్టులో బుధవారం పూర్తయింది. పోలీసుల తరఫున స్పెషల్ పీపీ విజయమ్మ తమ వాదనలు వినిపించారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి ఇప్పటికే వాదనలు వినిపించారు. ఉభయుల వాదనలు పూర్తికావడంతో కోర్టు న్యాయమూర్తి సరస్వతి తుది తీర్పు శుక్రవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎరువుల కొరత లేదు
● జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి
సంగం: జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని, అందుకు అవసరమైన ఎరువులు సిద్ధం చేస్తున్నామని, ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి తెలిపారు. మండలంలోని తలుపురుపాడు పంచాయతీ కార్యాలయంలో బుధవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రైతులకు పంటల సాగు, నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. ప్రస్తుతానికి 11 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించామన్నారు. గోదాముల్లో 1,690 మెట్రిక్ టన్నుల యూరియా, 350 మెట్రిక్ టన్నుల డీఏపీ నిల్వ ఉందన్నారు. రైతులు నానో యూరియా, డీఏపీ వాడాలని కోరారు. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాజున్ని, సంగం సాగునీటి సంఘం అధ్యక్షుడు షేక్ బాబు, వ్యవసాయ శాఖ ఏడీఏలు నర్సోజీ, అనిత, వ్యవసాయాధికారి శశిధర్, వ్యవసాయ విస్తరణాధికారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

132 మందికి ఉద్యోగాలు

132 మందికి ఉద్యోగాలు