పేలుడు సామగ్రి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

పేలుడు సామగ్రి స్వాధీనం

Jun 18 2025 3:31 AM | Updated on Jun 18 2025 3:31 AM

పేలుడ

పేలుడు సామగ్రి స్వాధీనం

ఉదయగిరి: ఉదయగిరి దుర్గంపై గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయన్న విషయం వెలుగులోకి రావడంతో మంగళవారం అటవీ, పోలీసు శాఖ సిబ్బంది స్పందించారు. దుర్గంపైకి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దుర్గంపైన ఉన్న రామ బుగ్గ, కరీమ్‌ బుగ్గ ప్రాంతంలో తవ్వకాలు జరిపినట్లుగా గుర్తించారు. ఆ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకందారులు వదిలివెళ్లిన పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 16 జిలెటిన్‌ స్టిక్స్‌తోపాటు విద్యుత్‌ వైర్లు, పేలుడుకు ఉపయోగించే స్టార్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముఠా కొన్నిరోజులనుంచి దుర్గంపైనే మకాం పెట్టి భారీ స్థాయిలో తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. విలువైన సంపదను కూడా ఈ తవ్వకందారులు తీసుకెళ్లి ఉంటారనే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. శనివారం రాత్రి ఉదయగిరిలోని దిలావర్‌భాయి వీధికి చెందిన పలువురు యువకులు పార్టీ చేసుకునేందుకు దుర్గంపైకి వెళ్లారు. వారిని గమనించి గుప్తనిధుల తవ్వకందారుల ముఠా పరారైనట్లు తెలుస్తోంది.

పేలుడు సామగ్రి స్వాధీనం 1
1/1

పేలుడు సామగ్రి స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement