పశువైద్యులకు క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

పశువైద్యులకు క్రీడా పోటీలు

Apr 20 2025 11:58 PM | Updated on Apr 20 2025 11:58 PM

పశువైద్యులకు క్రీడా పోటీలు

పశువైద్యులకు క్రీడా పోటీలు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఆదివారం పశువైద్యులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఆ శాఖ జిల్లా జేడీ రమేష్‌ నాయక్‌ పోటీలను ప్రారంభించారు. ప్రపంచ పశువైద్యుల దినోత్సవ నేపథ్యంలో వీటిని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్చరీ, వాలీబాల్‌, త్రో బాల్‌, టెన్నిస్‌, మ్యూజికల్‌ చైర్స్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌ తదితర పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్‌ నాగమణి, డాక్టర్‌ శ్రీధర్‌, రాష్ట్ర పశువైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ పి.జయప్రకాష్‌, డాక్టర్‌ కృష్ణమౌర్య, డాక్టర్‌ బొడ్డు ప్రసాద్‌, డాక్టర్‌ చైతన్య కిశోర్‌, డాక్టర్‌ కె.అరుణ, డాక్టర్స్‌ ఫార్మా ఎండీ డాక్టర్‌ సి.చలమయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement