Norway Chess 2022: ఆనంద్‌కు మూడో స్థానం | Viswanathan Anand finishes third in Norway Chess classical tournament | Sakshi
Sakshi News home page

Norway Chess 2022: ఆనంద్‌కు మూడో స్థానం

Jun 12 2022 6:36 AM | Updated on Jun 12 2022 6:36 AM

Viswanathan Anand finishes third in Norway Chess classical tournament - Sakshi

స్టావెంజర్‌: నార్వే ఓపెన్‌ క్లాసికల్‌ చెస్‌ టోర్నమెంట్‌ను భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ మూడో స్థానంతో ముగించాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో 52 ఏళ్ల ఆనంద్‌ 14.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

ప్రపంచ చాంపియన్, కార్ల్‌సన్‌ (నార్వే) 16.5 పాయింట్లతో టైటిల్‌ను సొంతం చేసుకోగా... మమెదైరోవ్‌ (అజర్‌బైజాన్‌) 15.5 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. చాంపియన్‌ కార్ల్‌సన్‌కు 7,50,000 నార్వే క్రోన్‌లు (రూ. 60 లక్షల 36 వేలు), రన్నరప్‌ మమెదైరోవ్‌కు 4,00,000 నార్వే క్రోన్‌లు (రూ. 32 లక్షల 19 వేలు), మూడో స్థానంలో నిలిచిన ఆనంద్‌కు 2,50,000 నార్వే క్రోన్‌లు (రూ. 20 లక్షల 12 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement