
పంజాబ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక క్రికెటర్ పిచ్పైనే ప్రాణాలొదిలాడు. ఉత్సాహంగా మ్యాచ్ ఆడుతున్న అతడు.. సిక్సర్ బాదిన వెంటనే గుండెపోటుతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే అతడు మరణించినట్లు సమాచారం.
మృతుడిని హర్జీత్ సింగ్గా గుర్తించారు. కాగా ఫిరోజ్పూర్లోని డీఏవీ పాఠశాల మైదానంలో రెండు జట్లు క్రికెట్ మ్యాచ్లో తలపడుతున్నాయి. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హర్జీత్.. సిక్సర్తో అలరించాడు. అయితే, ఆ వెంటనే పిచ్ మధ్యలోకి వచ్చిన అతడు ఒక్కసారిగా కుప్పకూలాడు.
ఇంతలో సహచర ఆటగాళ్లు వచ్చి హర్జీత్ను పైకిలేపే ప్రయత్నం చేశారు. పరిస్థితిని గమనించి సీపీఆర్ (CPR- కార్డియోపల్మనరీ రిససిటేషన్) చేశారు. కానీ అప్పటికే అతడు స్పృహ కోల్పోయిన అతడిలో ఎలాంటి చలనం కనిపించలేదు. గుండెపోటు కారణంగా హర్జీత్ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
సిక్సర్బాది ఆ వెంటనే
కాగా సిక్సర్బాది ఆ వెంటనే అతడు కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. హర్జీత్ కుటుంబానికి నెటిజన్లు సానుభూతి తెలుపుతున్నారు. కాగా గతేడాది కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 35 ఏళ్ల క్రికెటర్ ఒకరు పుణెలోని గర్వారే స్టేడియంలో మ్యాచ్ ఆడుతూనే గుండెపోటుకు గురయ్యాడు.
ఓపెనర్గా బ్యాటింగ్కు వచ్చిన ఇమ్రాన్ పటేల్ అనే వ్యక్తి కాసేపటికే ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పి.. ఫీల్డ్ అంపైర్ల అనుమతితో మైదానాన్ని వీడాడు. కానీ పెవిలియన్ చేరేలోపే అతడు కుప్పకూలిపోయాడు. పూర్తి ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అతడు గుండెపోటు కారణంగా మృతి చెందడం గమనార్హం. ఆల్రౌండర్ అయిన ఇమ్రాన్ మైదానంలో ఎంతో చురుగ్గా ఉండేవాడని.. దురదృష్టవశాత్తూ అతడిని కోల్పోయామని తోటి ఆటగాళ్లు, స్నేహితులు విచారం వ్యక్తం చేశారు.
A local cricketer in Ferozepur hit a six off a delivery, but just moments later, he suffered a heart attack and tragically collapsed on the ground, losing his life. pic.twitter.com/7j4WXolkFf
— Vipin Tiwari (@Vipintiwari952) June 29, 2025