థామస్‌ కప్‌ విన్నింగ్‌ జట్టు సభ్యుడికి గాయం.. థాయ్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమణ

Thomas Cup Stars Satwiksairaj And Chirag Shetty Pull Out Of Thailand Open 2022 - Sakshi

నేటి నుంచి థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టోర్నీ

బ్యాంకాక్‌: ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ టైటిల్‌ భారత్‌కు దక్కడంలో కీలకపాత్ర పోషించిన డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి నేటి నుంచి మొదలయ్యే థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి వైదొలిగింది. చిరాగ్‌ శెట్టి గాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌ విభాగంలో థామస్‌ కప్‌ ‘హీరో’లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్‌ బరిలో ఉన్నారు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, సౌరభ్‌ వర్మ కూడా పోటీపడుతున్నారు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top