Strasbourg Open: క్వార్టర్స్‌లో సానియా జంట 

Sania Mirza, Lose Hardest Enters Quarters In Strasbourg Open - Sakshi

పారిస్‌: స్ట్రాస్‌బర్గ్‌ ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ టోర్నీలో టాప్‌ సీడ్‌ సానియా మీర్జా (భారత్‌)–లూసీ హర్డెస్కా (చెక్‌ రిపబ్లిక్‌) జంట శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన డబుల్స్‌ తొలి రౌండ్‌లో సానియా–హర్డెస్కా ద్వయం 3–6, 6–3, 10–8తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో లుద్మిలా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)–తెరీజా మిహలికోవా (స్లొవేకియా) జోడీపై విజయం సాధించింది. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ రెండు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది. మ్యాచ్‌ హోరాహోరీగా సాగినా నిర్ణాయక సూపర్‌ టైబ్రేక్‌లో సానియా–హర్డెస్కా ద్వయం పైచేయి సాధించింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top