IND Vs SA: రోహిత్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!
ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన అఖరి టీ20లో 49 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 178 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కార్తీక్(46) టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ తీవ్రంగా నిరాశపరిచాడు. రబాడ వేసిన తొలి ఓవర్లో రోహిత్ డకౌట్గా వెనుదిరిగాడు.
ఈ క్రమంలో రోహిత్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్ స్కోర్కే ఔటైన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటి వరకు 43 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు.
ఇంతకుముందు ఈ చెత్త రికార్డు ఐర్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్(42 సార్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో రోహిత్ ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022 కోసం టీమిండియా ఆక్టోబర్6న ఆస్ట్రేలియాకు బయలు దేరనుంది.
చదవండి: T20 World Cup 2022: బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? రోహిత్ ఎమన్నాడంటే?