
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఊహించని షాకిచ్చింది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో అంపైర్తో వాగ్వదం దిగినందుకు గానూ పంత్కు ఓ డిమెరిట్ పాయింట్ ఐసీసీ విధించింది.
ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ని ఉల్లంఘించినందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత 24 నెలలలో ఇదే తొలి తప్పిదం అయినందున కేవలం ఒక డీమెరిట్ పాయింట్తో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సరిపెట్టింది.
అసలేమి జరిగిందంటే?
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 61 ఓవర్లో బంతిని మార్చమని ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్పై పంత్ ఒత్తిడి తీసుకొచ్చాడు. బంతి కండీషన్ బాగోలేదని కొత్త బంతిని తీసుకురావాలని పంత్ సూచించాడు. కానీ ఫీల్డ్ అంపైర్లు బంతిని పరిశీలించి, మార్చాల్సిన అవసరంలేదంటూ అదే బాల్ను తిరిగి పంత్కు ఇచ్చాడు.
ఈ క్రమంలో సహనం కోల్పోయిన పంత్.. బంతిని నేలకేసి బలంగా కొట్టాడు. దీంతో అంపైర్లు మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్కు ఫిర్యాదు చేశారు. పంత్ కూడా తన తప్పును అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే పంత్పై ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఈ చర్యలు తీసుకున్నారు.
శతక్కొట్టిన పంత్..
కాగా ఈ మ్యాచ్లో పంత్ సెంచరీలు మోత మోగించాడు. రెండో ఇన్నింగ్స్లలోనూ శతకాలు బాది సంచలనం సృష్టించాడు. ఓ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన తొలి భారత వికెట్ కీపర్గా రికార్డులకెక్కాడు. తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 118 పరుగులు చేశాడు. కాగా తొలి టెస్టులో విజయంపై భారత్ కన్నేసింది.
ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని గిల్ సేన ఉంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు ఆటలో ఎవరు మెరుగ్గా రాణిస్తే వారిదే విజయం.
చదవండి: రింకూ సింగ్- ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి వాయిదా!.. కారణం ఇదే!