వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు సింధు దూరం

PV Sindhu pulls out of BWF World Tour Finals - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే నెలలో చైనాలో జరిగే బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నీ ‘వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌’   నుంచి భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు వైదొలిగింది. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడం వల్లే టోర్నీకి దూరమవుతున్నట్లు ఆమె తెలిపింది.

ఆగస్టులో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆమె గాయపడింది. ‘మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్‌ సూచించారు. అప్పుడే కొత్త సీజన్‌ను పూర్తి ఫిట్‌నెస్‌తో, ఉత్సాహంతో ప్రారంభించవచ్చని చెప్పారు. అందువల్లే టోర్నీ నుంచి సింధు వైదొలగాలని నిర్ణయించుకుంది’ అని ఆమె తండ్రి రమణ వెల్లడించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top