
ఎఫ్ఐహెచ్ మహిళల ప్రొ లీగ్లో భారత అమ్మాయిలు ఆఖరిదాకా పోరాడినా ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తప్పలేదు. లండన్ వేదికగా శనివారం జరిగిన పోరులో మహిళల జట్టు 2–3 స్కోరుతో కంగారు చేతిలో కంగుతింది. ఆరంభంలో భారత అమ్మాయిలకు కలిసిరాలేదు. తొలిక్వార్టర్లో రెండు పెనాల్టీ కార్నర్లు లభించగా... భారత స్ట్రయికర్లు లక్ష్యం చేర్చేందుకు శతవిధాలా ప్రయతి్నంచారు.
కానీ ప్రత్యర్థి డిఫెండర్లు, గోల్కీపర్ అలీషా సమన్వయంతో అడ్డుకున్నారు. అయితే రెండో క్వార్టర్ మొదలైన నిమిషంలోనే కౌట్నే షానెల్ (16వ నిమిషం) భారత రక్షణ పంక్తిని బోల్తాకొట్టించి ఆసీస్కు గోల్ తెచి్చపెట్టింది. ఇదే క్వార్టర్లో మరో పదినిమిషాలు గడిచేసరికి నెట్వద్ద చురుగ్గా మాటువేసిన లెక్సీ పికెరింగ్ (26వ నిమిషం) చాకచక్యంగా గోల్ చేసి ఆసీస్ ఆధిక్యాన్ని 2–0తో రెట్టింపు చేశారు.
తిరిగి మూడో క్వార్టర్ మొదలైన కాసేపటికే టాటమ్ స్టివార్ట్ (35వ నిమిషం) పెనాల్టీ స్ట్రోక్తో కంగారూ సేన 3–0తో ఎదురులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎట్టకేలకు మూడో క్వార్టర్ ముగిసే దశలో డ్రాగ్ఫ్లికర్ దీపిక (44వ నిమిషం) చేసిన గోల్తో భారత్ ఖాతా తెరువగలిగింది.
1–3తో తొలిసారి ఆధిక్యానికి గండికొట్టిన భారత్ మళ్లీ 6 నిమిషాల వ్యవధిలో దీపిక ఫ్లిక్ చేసిన బంతి రి»ౌండ్ కాగా... పక్కనే ఉన్న నేహా (52వ నిమిషం)సమయస్ఫూర్తితో ప్రత్యర్థి గోల్పోస్ట్లోకి తరలించింది. ఆఖర్లో స్కోరును సమం చేసే అవకాశం పెనాల్టీ కార్నర్ రూపంలో వచి్చనప్పటికీ గోల్గా మలచడంతో భారత స్ట్రయికర్లు విఫలమాయ్యరు. ఆదివారం ఇదే వేదికపై ఆ్రస్టేలియాతో భారత అమ్మాయిలు రెండో మ్యాచ్ ఆడతారు.