సెమీఫైనల్లో ఓడిన సానియా జంట | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో ఓడిన సానియా జంట

Published Sun, Feb 20 2022 5:30 AM

Dubai Tennis Championships: Sania Mirza, Lucie Hradecka lose doubles semis - Sakshi

దుబాయ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ డబుల్స్‌ విభాగంలో సానియా మీర్జా (భారత్‌)–లూసీ హర్డెస్కా (చెక్‌ రిపబ్లిక్‌) జంట పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 6–2, 2–6, 7–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)–ఒస్టాపెంకో (లాత్వియా) జోడీ చేతిలో ఓడింది. సెమీస్‌లో నిష్క్రమించిన సానియా–హర్డెస్కా జోడీకి 12,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 33 వేలు) లభించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement