IPL 2021: లండన్‌ నుంచి దుబాయ్‌కి చేరనున్న సీఎస్‌కే ఆటగాళ్లు

CSK Trying To Get Players From Manchester To Dubai On Saturday - Sakshi

దుబాయి: ఇంగ్లండ్‌తో జరగల్సిన 5 టెస్ట్‌ మ్యాచ్‌ కరోనా కారణంగా రద్దుకావడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగమైన భారత ఆటగాళ్లను శనివారం నాటికి దుబాయ్‌కి తీసుకెళ్లాలని యాజమాన్యం  భావిస్తోంది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ దృవీకరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ  రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, చేతేశ్వర్ పూజారా సీఎస్‌కే ప్రత్యేక విమానంలో దుబాయ్‌కు చేరనున్నారు అని తెలిపారు.

భారత శిక్షణా బృందంలో కరోనా కేసులు వెలుగు చూడడంతో యూఏఈలో ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో గడుపుతారని కాశీ విశ్వనాథ్ చెప్పారు. సిఎస్‌కే జట్లులో భాగమైన ఇంగ్లండ్ ఆటగాళ్లు మొయిన్ అలీ, సామ్ కుర్రాన్ అదే విమానంలో తమ సహచరులతో చేరతారా లేదా తరువాత దుబాయికి వస్తారా అనేది ఆయన సృష్టత ఇ‍వ్వలేదు. దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ప్రారంభం కానుంది.

ఇంగ్లండ్‌ నుంచి యూఏఈ వచ్చే ప్రతి ఆటగాడు వాళ్ల జట్టుతో బయోబబుల్‌ చేరడానికి ముందు ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా బయో బబుల్ నుంచి బయో బబుల్ ట్రాన్స్‌ఫర్‌కి అనుమతి ఉన్నా, భారత బృందంలో కరోనా కేసులు వెలుగు చూడడంతో యూఏఈలో ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.

చదవండి: చెలరేగిన లాథమ్‌ ..చివరి టీ20లో కివీస్‌ గెలుపు

UK నుండి UAE కి వచ్చే ప్రతి ఆటగాడు జట్టు బుడగలలో చేరడానికి ముందు ఆరు రోజుల నిర్బంధంలో ఉండాల్సి ఉంటుందని BCCI మాకు తెలియజేసింది. సహజంగానే, UK నుండి UAE కి బబుల్-టు-బబుల్ బదిలీ అనేది ప్రస్తుత దృష్టాంతాన్ని దృష్టిలో ఉంచుకోదు, ”అని ఫ్రాంచైజ్ అధికారి ఒకరు తాజా గా పేర్కొన్నారు. UK నుండి తమ ఆటగాళ్లను ఎయిర్‌లిఫ్టింగ్ చేస్తున్న అనేక ఫ్రాంచైజీల గురించి మాట్లాడుతూ, RCB తమ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు ఏస్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కోసం చార్టర్ ఫ్లైట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. వారు శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో UK నుండి దుబాయ్ వెళ్తారు. ఆటగాళ్ల సురక్షిత రవాణా వారికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని జట్టు మూలం జోడించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top