ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా తప్పెట శంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజేంద్రపాల్ గౌతమ్, టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సత్యనారాయణలు శనివారం నియామక పత్రాన్ని ఢిల్లీలో అందించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఉపాధ్యక్షులుగా కొత్తూరి నరహరి, బండమీది తిరుపతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.
50% ఫిట్మెంట్తో
పీఆర్సీ ప్రకటించాలి
వర్గల్(గజ్వేల్): ప్రభుత్వం 50% ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్ డిమాండ్ చేశారు. శనివారం వర్గల్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్రెడ్డి, నర్సింహారెడ్డితో కలిసి పలుపాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆరు నెలలలోపు పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.
చేనేత కార్మికుల
ఇబ్బందులు తీరుస్తాం
గజ్వేల్: చేనేత కార్మికుల ఇబ్బందులను తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని గజ్వేల్ చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడు స్వర్గం రాజేశం అన్నారు. శనివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి గౌతమ్ నుంచి ధ్రువీకరణ పత్రం అందుకొని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందేలా ప్రయత్నిస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, సంఘం ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి రామచంద్రం డైరెక్టర్లు భాగ్యలక్ష్మి, అమృతమ్మ, ప్రసాద్, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.


