బంగారం అపహరించిన మహిళల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

బంగారం అపహరించిన మహిళల అరెస్టు

Jun 27 2023 12:38 PM | Updated on Jun 27 2023 12:46 PM

పోలీసుల అదుపులో నిందితులు - Sakshi

పోలీసుల అదుపులో నిందితులు

మెదక్‌ మున్సిపాలిటీ: బంగారం అపహరించిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ సీఐ వెంకటేష్‌ తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 9వ తేదీన మెదక్‌ పట్టణంలోని మెహతాబ్‌ బంగారు దుకాణంలో నలుగురు మహిళలు 30 గ్రాముల బంగారు బిస్కెట్‌, 4 జతల కమ్మలు అపహరించారు. దుకాణయజమాని షకీల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సీసీ కెమెరాల ఆధారంగా ఖమ్మం జిల్లాలోని మధిర మండలం, రాయపట్నం గ్రామానికి చెందిన బాలసాని వెంకటరామమ్మ, బొజ్జని నాగేంద్రమ్మ, బొజ్జని దీనమ్మ , నల్లబొట్ల వెంకటమ్మలుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దొంగలను పట్టుకున్న ఎస్‌ఐ లింగం, కానిస్టేబుల్‌ సాయిబాబాగౌడ్‌, శివరాజ్‌గౌడ్‌, గంగరాజు, రవి, రాజులను సీఐ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement