గణేశ్‌ ఉత్సవాలకు డీజే అనుమతి లేదు | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ ఉత్సవాలకు డీజే అనుమతి లేదు

Aug 26 2025 8:28 AM | Updated on Aug 26 2025 8:28 AM

గణేశ్‌ ఉత్సవాలకు డీజే అనుమతి లేదు

గణేశ్‌ ఉత్సవాలకు డీజే అనుమతి లేదు

● రాచకొండ సీపీ సుధీర్‌బాబు

ఇబ్రహీంపట్నం రూరల్‌: గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలకు డీజేలకు అనుమతి లేదని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు స్పష్టం చేశారు. ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకొనేలా చూడాలన్నారు. విగ్రహాల ఏర్పాటుకు తప్పనిసరి ఆన్‌లైన్‌ అనుమతులు తీసుకోవాలన్నారు. పోలీసు సిబ్బంది ప్రతి మండపం వద్దకు వెళ్లి పరిశీలించాలన్నారు. ప్రభుత్వం మండపాలకు ఉచిత విద్యుత్‌ అందజేస్తోందని తెలిపారు. విద్యుత్‌, అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగే విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా మసలు కోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టేషన్‌లో నమోదైన కేసుల పురోగతి గురించి సీఐని అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement