
తహసీల్దార్ల బదిలీ
ఆమనగల్లు: జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీచేస్తూ శుక్రవారం కలెక్టర్ నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డ తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలకు తహసీల్దార్లను నియమించారు. కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న మహ్మద్ ఫయిం ఖాద్రిని ఆమనగల్లు తహసీల్దార్గా, కొందుర్గు తహసీల్దార్గా పనిచేస్తున్న రమేశ్ను తలకొండపల్లి తహసీల్దార్గా నియమించారు. కలెక్టరేట్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న నాగయ్యను ఫరూఖ్నగర్ తహసీల్దార్గా, నందిగామ తహసీల్దార్గా పనిచేస్తున్న రాజేశ్వర్ను కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్గా, మహేశ్వరం తహసీల్దార్గా పనిచేస్తున్న సైదులును నందిగామ తహసీల్దార్గా బదిలీచేశారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న చిన్న అప్పలనాయుడును మహేశ్వరం తహసీల్దార్గా కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న రాజేందర్రెడ్డిని కొందుర్గు తహసీల్దార్గా, ఫరూఖ్నగర్ తహసీల్దార్గా ఉన్న పార్థసారధిని కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.