దుబాయ్లో యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. కానీ అత్యవసర సర్వీసులు అన్నీ పని చేస్తున్నాయి. పెద్దగా ఇబ్బంది లేదు. భయపడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చూడని కళ్లకు.. తెలియని భయం ఉన్నట్లే.. ఇక్కడ ఏం జరుగుతుందో అనే ఆందోళన ఉండడం సహజం. కానీ ఏం భయపడవద్దు. విమానాల రద్దుతో ఆగిపోయిన వారికి స్టార్ హోటళ్లలో ప్రభుత్వమే వసతి కల్పించింది. చాలా క్షిపణులను దుబాయ్ ఆర్మీ డ్రోన్లతో కూల్చివేస్తున్నాయి. తెలంగాణలోని వలస జీవుల కుటుంబాలు అనవసరంగా భయపడి ఆరోగ్యం పాడుచేసుకోవద్దు. క్షేమంగా ఉన్నాం.
– కటుకం రవి, బండపల్లి(చందుర్తి)


