చంద్రబాబూ.. ఇది మీరిచ్చిన వాగ్దానమే: వైఎస్‌ జగన్‌ | YS Jagan Releases Video On Chandrababu's Past Promises | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. ఇది మీరిచ్చిన వాగ్దానమే: వైఎస్‌ జగన్‌

Oct 28 2024 10:16 AM | Updated on Oct 28 2024 10:56 AM

YS Jagan Releases Video On Chandrababu's Past Promises

అమరావతి:  ఏపీలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక విద్యుత్‌ చార్జీలు పెంచడమేనా? అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ప్రశ్నించారు. వచ్చే ఐదేళ్లు కరెంట్‌ చార్జీలు పెంచమంటూ ఎన్నిలక ముందు ఇచ్చిన హామీ ఏమైందంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఒక వీడియోను పోస్ట్‌ చేశారు వైఎస్‌ జగన్‌. ‘ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానం గుర్తుచేస్తున్నా’ అంటూ చంద్రబాబు 2024 ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన వీడియోను వైఎస్‌ జగన్‌ షేర్‌ చేశారు.

తాము అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్‌ చార్జీలు తగ్గించేవాళ్లం అని గతంలో చెప్పిన మీరు.. ఇప్పుడు ప్రజలు ఎంతగా వద్దని వేడుకున్నా వినిపించుకోకుండా రూ.6,072.86 కోట్ల భారం వేయడం భావ్యమేనా? అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు. ఇదే విషయంపై నిన్న(ఆదివారం) చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌.. తాజాగా వీడియోను పోస్ట్‌ చేసి మరీ చంద్రబాబు మోసపూరిత విధానాన్ని బయటపెట్టారు. 

 

కరెంట్‌ చార్జీల పెంపు  దీపావళి కానుకా?: వైఎస్‌ జగన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement