దర్మంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు 

Somu Veerraju Comments On Chandrababu Naidu - Sakshi

సోము వీర్రాజు మండిపాటు 

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ధర్మాన్ని నమ్మే వ్యక్తే అయితే ధర్మాత్ముడులాంటి ఎన్టీ రామారావును ఎందుకు దించేశాడంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో ఉండే ప్రతిపక్షం వారికి ధర్మం గుర్తుకొచ్చి ట్వీట్లు పెడుతున్నారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే రాష్ట్రంలో 30 గుళ్లను పడగొట్టారని, ఆ దేవుడి విగ్రహాలను చెత్తబుట్టలో పడేశారని.. ఇప్పుడాయన ధర్మం గురించి మాట్లాడుతున్నారంటూ వీర్రాజు ఎద్దేవా చేశారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..  

► రాజమండ్రి పుష్కరాల్లో 30 మంది మరణానికి కారణమైన చంద్రబాబుకు ధర్మం గురించి మాట్లాడే హక్కులేదు. ధర్మం బీజేపీ ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వం ధర్మబద్ధంగా వెళ్లాలి.  
► శ్రీవారిని దర్శించుకునే సమయంలో అన్యమతస్తులు సంతకం పెట్టాలన్నది బీజేపీ విధానం.  
► దేవుళ్లపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తోంది. ఆయనకు మంచి బుద్ధిని ప్రసాదించాలని పార్టీ నేతలు ఆంజనేయస్వామికి వినతిపత్రాలు అందజేశారు. 
► రైతుల ఆదాయాన్ని 2024 నాటికి రెట్టింపు చేయాలనే మోదీ ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చింది. 
► సమావేశానంతరం సోము వీర్రాజు విజయవాడలోని మాచవరం ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో సోమువీర్రాజు మాట్లాడుతూ రాజధానితో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top