నేనేం అలగలేదు: మంత్రి పొన్నం | Ponnam Prabhakar Reacts On Balkampet Yellamma Incident | Sakshi
Sakshi News home page

బల్కంపేట ఘటన.. నేనేం అలగలేదు: మంత్రి పొన్నం

Jul 9 2024 6:26 PM | Updated on Jul 9 2024 7:31 PM

 Ponnam Prabhakar Reacts On Balkampet Yellamma Incident

హైదరాబాద్‌, సాక్షి: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ఈ ఉదయం జరిగిన తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి కొండా సురేఖ అంటున్నారు. ఈ ఘటనపై పోలీస్‌ శాఖ దర్యాప్తు చేస్తోందని అన్నారామె. మంగళవారం సాయంత్రం బల్కంపేట ఘటనపై మంత్రుల సమీక్ష జరిగింది. అంతకు ముందు మీడియాతో ఆమె బల్కంపేట ఘటనపై స్పందించారు.

బల్కంపేటలో ‘ప్రొటోకాల్‌’ ఘటనపై పొన్నం మాట్లాడారు. ఈ ఘటన విషయంలో నేను అలగలేదు. మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగింది. తోపులాట నివారించేందుకు ఆగి.. కాసేపు అధికారులతో మాట్లాడాం. తోపులాట జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారుల్ని ప్రశ్నించా? అంతే అని అన్నారాయన. 

మూడు రోజులపాటు జరిగే ఎల్లమ్మ కల్యాణోత్సవాల్లో భాగంగా.. ఈ ఉదయం పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సతీసమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ గుడికి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ల వెంట నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా గుడిలో తోపులాట జరిగింది. ఈ ఘటనతో మంత్రి పొన్నం, మేయర్‌ అలిగి గుడి బయటే కూర్చున్నారు. తమ విషయంలో ప్రొటోకాల్‌ పాటించలేదని ఆయన అధికారులపై చిందులు తొక్కారని, ఎవరు నచ్చజెప్పినా వినలేదని కథనాలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement