Munugode By-Election 2022: Congress Announce Munugode By-Election Candidate Palvai Sravanthi Reddy - Sakshi
Sakshi News home page

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

Sep 9 2022 12:57 PM | Updated on Sep 9 2022 1:56 PM

Munugode By Election Congress Declared Candidate Palvai Sravanthi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిని ఏఐసీసీ ఖరారు చేసింది. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా కాంగ్రెస్‌ జనరల్‌​ సెక్రటరీ ముఖుల్‌ వాస్నిక్‌ ప్రకటించారు.

కాగా, అంతకుముందు టీపీసీసీ నలుగురు అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపించింది. అందులో పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, కైలాష్ నేత, పల్లె రవి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో  కాంగ్రెస్‌ అధిష్టానం పాల్వాయి స్రవంతి వైపే మొగ్గుచూపింది. మునుగోడు నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్టలు ఉండటం కూడా ఆమెకు కలిసొచ్చింది. గతంలోనూ స్రవంతి అక్కడ నుంచి పోటీచేసి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించారు. 

చదవండి: (జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ గ్రాండ్‌ ఎంట్రీ.. ముహూర్తం ఫిక్స్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement