రైతు బంధుపై కమిటీ అంటే మోసమే: జగదీష్‌రెడ్డి | Jagadish Reddy Press Meet On Rythu Bharosa At Telangana Bhavan | Sakshi
Sakshi News home page

రైతు బంధుపై కమిటీ అంటే మోసమే: జగదీష్‌రెడ్డి

Jun 23 2024 4:52 PM | Updated on Jun 23 2024 5:25 PM

Jagadeesh Reddy Press Meet On Rythu Bharosa In Telangana Bhavan

సాక్షి,హైదరాబాద్‌: ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం అయిందని, ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు సాయాన్ని ఆపడానికి వీలులేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం(జూన్‌23)తెలంగాణ భవన్‌లో మరో నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

‘రైతు భరోసా పేరుతో రూ. 15,000 ఇస్తామని మాట తప్పారు. రైతు భరోసాపై కేబినెట్‌ సబ్ కమిటీ ఎందుకు వేస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ వెనుక ఉన్న మతలబు ఏంటి? రైతు రుణమాఫీతో సంబంధం  లేకుండా రైతులకు  ఇవ్వాలి. కమిటీ అంటే రైతులను మోసం చేయడమే. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం. పింఛన్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. 

విద్యుత్ బిల్లుల మాఫీ స్కీమ్‌ రాష్ట్రంలో అమలు కావడం లేదు. యాసంగిలో రైతులకు ఏ విధంగా రైతుబంధు ఇచ్చారో ఇప్పుడు అట్లాగే ఇవ్వండి. బీఆర్ఎస్ హయాంలో జూన్ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు వచ్చేది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది. పురుషులు,మహిళలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. 

వీధి కుక్కలు సైతం మహిళలపై దాడులు చేస్తున్నాయి. విద్యుత్ కమిషన్‌ నుంచి నాకు లెటర్ వచ్చింది. వారం రోజుల్లో కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై మీ అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారు. 

పవర్‌ కమిషన్‌ ముందుకు వెళ్లి నాకు ఉన్న సమాచారాన్ని ఇస్తాను. కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులను బయటపెడతాను. ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్ సింగ్,విద్యుత్ అధికారుల నుంచి సమాచారం తీసుకోవాలి. లేదంటే కమిషన్‌ చైర్మన్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ నుంచి తప్పుకోవాలి’అని జగదీష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement