‘రెండు నెలల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చేయగలం’

GHMC Elections 2020: AIMIM MLA Mumtaz Ahmed Khan Slams TRS - Sakshi

చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీపై చార్మినార్‌ ఎమ్మెల్యే, మజ్లీస్ పార్టీ సీనియర్‌ నేత ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్  సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే రెండు నెలల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని  కూల్చేయగలమని హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  మజ్లీస్ పార్టీ చాలా మందిని చూసిందని, తమ అధినేత చెప్పినట్టు రాజకీయం తమ ఇంటి గుమస్తాతో సమానం అన్నారు. కేటీఆర్‌ నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన చిలుక అని ఎద్దేవా చేశారు. తమకు రాజకీయాల్లో ఒకరిని గద్దే మీద కూరోచబెట్టడం తెలుసు.. గద్దె దించడం తెలుసు అని పరోక్షంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top