ఏపీకి కేంద్ర నిధులపై బీజేపీ నేత జీవీఎల్‌ క్లారిటీ | BJP Leader GVL Narasimha Rao Clarity On Central Funds For AP | Sakshi
Sakshi News home page

ఏపీకి కేంద్ర నిధులపై బీజేపీ నేత జీవీఎల్‌ క్లారిటీ

Jul 30 2024 11:12 AM | Updated on Jul 30 2024 11:37 AM

BJP Leader GVL Narasimha Rao Clarity On Central Funds For AP

సాక్షి, విశాఖపట్నం: అమరావతికి ఇచ్చిన 15 వేల కోట్లపై బీజేపీ నేత జివీల్ నరసింహారావు స్పష్టతనిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15 వేల కోట్లు రూపాయలు అప్పేనని తేల్చి చెప్పేశారు. ఈ అప్పు చెల్లించడానికి 30 ఏళ్ల సమయం పడుతుందని.. అప్పు కేంద్రం చెల్లిస్తుందా? రాష్ట్రం చెల్లిస్తుందా? అనే దానిపై మీద స్పష్టత రావాలన్నారు.

కాగా, ఇటీవల కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధానికి రూ.15 వేల కోట్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సాయమా లేక అప్పా అనేది చెప్పకుండా సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదారి పట్టించిన సంగతి తెలిసిందే. రుణమా లేక గ్రాంటా అనేది స్పష్టంగా ప్రకటించకుండా బీజేపీ నాయకత్వం పదాల గారడీతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది. మన రాష్ట్రం విషయంలో ఉత్తి మాటలు చెప్పిన కేంద్రం.. బీహార్‌కి మాత్రం భారీగా నిధులను కేటాయించింది. అధికార పార్టీ ఎంపీలు ఇంతమంది ఉండి ఏం చేస్తున్నారని, ఏం సాధించారని పలువురు నిలదీస్తున్నారు.
 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement