
AP Elections Political Latest Updates Telugu..
09:30PM, Jan 29, 2024
రెడ్బుక్ బెదిరింపులపై రేపు హైకోర్టులో విచారణ
- నారా లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసుపై రేపు ఏసీబీ కోర్టులో విచారణ
- యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్లతో వివాదాస్పద వ్యాఖ్యలు వేసిన లోకేష్
- చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని.. రిమాండ్ విధించడం తప్పంటూ ఎసిబి న్యాయస్ధానానికి దురుద్దేశాలు ఆపాదించిన లోకేష్
- రెడ్ బుక్ పేరుతో అధికారులకి బెదిరింపులు
- వీడియోలతో సహా ఎసిబి కోర్టులో గత నెలలో పిటీషన్ వేసిన సీఐడీ
- ఏసీబీ కోర్టు ఆదేశాలతో నోటీసులు పంపినా అందుకోని లోకేష్
- చివరగా ఏసీబీ కోర్టు నుంచే లోకేష్ కి నోటీసులు
- స్వయంగా హాజరై లేదా న్యాయవాది ద్వారా విచారణకి రావాలని గత వారం ఆదేశం
- ఈ నెల 22 న జరిగిన విచారణలో రెండు వారాల సమయం కోరిన లోకేష్ న్యాయవాదులు
- ఒక వారమే సమయమిచ్చిన న్యాయస్ధానం
- రేపు(మంగళవారం) జరగనున్న విచారణ
09:20PM, Jan 29, 2024
తూ.గో. రా కదలిరాలో అందుకే బాబు అలా మాట్లాడారు
- చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
- చంద్రబాబుకు మతి భ్రమించినట్టు ఉంది.. అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే రాజా
- రాజమండ్రి రాగానే ఆయన జైలు జీవితం గుర్తొచ్చినట్టుంది: ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
- చంద్రబాబు ఇతరులపై వ్యాఖ్యలు చేయడం కాదు.. ముందు తన పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలను చక్కదిద్దుకోవాలి
- ఉన్నవి లేనివి కల్పించుకుని ప్రజల్లో వైఎస్ఆర్సిపి పట్ల వ్యతిరేకత తీసుకొచ్చేందుకు మాట్లాడడం మినహా చంద్రబాబుకు ఏ విషయంలోనూ చిత్తశుద్ధి లేదు
09:10PM, Jan 29, 2024
చంద్రబాబు చిప్ అరిగిపోయింది: ఎంపీ భరత్ సెటైర్లు
- చంద్రబాబుకు అసలు రాజమండ్రిలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసా?
- తన హయాంలో ఏనాడైనా అభివృద్ధి చేశారా?
- చంద్రబాబు చిప్ అరిగిపోయింది
- రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి
- రెండు నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు కనీసం జైలు కిటికీలు నుంచైనా రాజమండ్రి అభివృద్ధిని చూసి ఉండాలి
- ఆయన కొడుకును రాజమండ్రిలో ఎమ్మెల్యేగా పోటీకి దింపాలి
- నేను చేసిన దాంట్లో సగం చేయగలిగినా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటాను
- నోరు ఉంది కదా అని ఇష్టారీతిన మాట్లాడటం సరికాదు
09:07PM, Jan 29, 2024
వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు చుక్కెదురు
- శాసనసభ సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు
- స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
- వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని కోరుతున్న వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు
- ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య పిటిషన్
- వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం
- మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
- ఈ దశలో జోక్యం చేసుకోలేమన్న ఏపీ హైకోర్టు
- కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం
- తదుపరి విచారణ ఫిబ్రవరి 26 కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
08:50PM, Jan 29, 2024
అడ్డంగా దొరికి.. అప్రూవర్ వాంగ్మూలం అడ్డుకునేందుకు కుట్రలు
- ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు అప్ డేట్
- అప్రూవర్ గా మారిన ఏసీఐ ఎండీ చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ ని అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు
- చంద్రకాంత్ షా పిటీషన్ పై అభ్యతరం వ్యక్తం చేస్తూ స్కిల్ స్కామ్ లో ఎ-2 ముద్దాయి మాజీ లక్ష్మీ నారాయణ ఎసిబి కోర్టులో పిటీషన్
- లక్ష్మీనారాయణ పిటీషన్ పై రేపు(మంగళవారం) ఏసీబీ కోర్టులో విచారణ
- అప్రూవర్ గా మారతానని ఏసిఐ ఎండి చంద్రకాంత్ షా ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటిషన్
- కౌంటర్ పేరుతో పలుమార్లు సమయం కోరిన చంద్రబాబు న్యాయవాదులు
- కేసులో కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని కోరిన చంద్రబాబు నాయుడు తరుపున న్యాయవాదులు
- దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరుపున న్యాయవాదులకు ఆదేశించిన కోర్టు
- అప్పటి వరకు సిరీష్ చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డు వాయిదా వేసిన ఏసిబి కోర్టు
- చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదుల అభ్యంతరాలపై ఈ నెల 22 న ఏసిబి కోర్టులో విచారణ
- కౌంటర్ వేయడానికి సమయమివ్వాలన్న చంద్రబాబు న్యాయవాదులు
- నేటి విచారణలో చంద్రకాంత్ షా పిటీషన్ ని వ్యతిరేకిస్తూ ఏ2 లక్ష్మీనారాయణ కౌంటర్ పిటీషన్
- అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదుల కుట్రలు
08:09PM, Jan 29, 2024
ఐదో జాబితాపై కొనసాగుతున్న కసరత్తు
- నియోజకవర్గాల ఇంఛార్జిలపై మార్పులు చేర్పులపై కొనసాగుతున్న కసరత్తులు
- ఐదో జాబితా మరో రెండు రోజుల్లో?
- సిట్టింగ్లు, ఆశావహులతో వరుస చర్చలు జరుపుతున్న పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి
- సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కడుతున్న నేతలు
- సీఎంవోకు వచ్చిన తోపుదుర్తి ప్రకాశ్, సుచరిత, మంత్రి జోగి రమేష్, మంత్రి మోపిదేవి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తదితరులు
07:32PM, Jan 29, 2024
ఏపీ ఎన్నికల్లో కమలం ఒంటరిపోరు
- ఏపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్న బీజేపీ
- ఇప్పటికే క్లస్టర్లుగా విభజించి వరుస సమావేశాలతో దిశానిర్దేశం
- రెండు రోజులుగా కొనసాగుతున్న సమావేశాలు
- మరోవైపు.. క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగిన కొందరు నేతలు
- ఓడిపోయే టీడీపీతో పొత్తేంటన్న భావనలో మెజార్టీ నేతలు
- ఇదే విషయాన్ని అధిష్టానానికి నివేదించిన సీనియర్లు
- టీడీపీతో బీజేపీ చెయ్యి కలిపించేందుకు పవన్ యత్నం
- టీడీపీతో వెళ్తేనే బాగుంటుందని మొదటి నుంచి పురందేశ్వరి అధిష్టానానికి నివేదికలు
- పలు సర్వేల ఆధారంగా ఓ నిర్ణయానికి వచ్చిన బీజేపీ అధిష్టానం
- ఓడిపోయే పార్టీతో జట్టు వద్దని కంక్లూజన్
- మరిది చంద్రబాబుతో పొత్తు చేస్తున్న పురందేశ్వరి ప్రయత్నాలకు చెక్
- పవన్నూ పక్కన పడేయాలని నిర్ణయం
07:19PM, Jan 29, 2024
చిలకలూరిపేట నుంచే సామాజిక న్యాయం: మంత్రి రజని
- సామాజిక న్యాయం పేరిట రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు.. బహిరంగ సభలు నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ
- గత 56 నెలల్లో వివిధ సామాజిక వర్గాలకు జరిగిన న్యాయాన్ని.. ఆయా సామాజిక వర్గ నేతల ద్వారానే జనాలకు వివరిస్తున్న వైనం
- బ్రహ్మరథం పడుతున్న ఏపీ ప్రజానీకం
- పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో విడుదల రజిని ఆధ్వర్యంలో సామాజిక సాధికార సభ
మంత్రి విడదల రజనీ మాట్లాడుతూ..
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమం ,అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారు
- సామాజిక న్యాయం చిలకలూరిపేట నుంచే ప్రారంభమైంది
- ఒక బీసీ మహిళలైన నాకు చిలకలూరిపేట సీటు ఇచ్చి గెలిపించి మంత్రిగా సీఎం జగన్ అవకాశం ఇచ్చారు
- గతంలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి మా ప్రభుత్వంలో చిలకలూరిపేటలో జరిగింది
- వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలి మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలి
- మల్లెల రాజేష్ నాయుడు, చిలకలూరిపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త
- స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు అమలు చేసినందుకు పథకాలు ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేదు
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చిలకలూరిపేట అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది
- చిలకలూరిపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మరోసారి కానుక అందిద్దాం
ముస్తఫా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మాట్లాడుతూ..
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చాలా పెద్దవిగా ఉంటాయి
- దేశంలోనే 30 లక్షల మందికిపైగా నిరుపేదలకు ఇల్లపట్టాలు పంపిణీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
విడుదల రజిని, ఎమ్మెల్సీలు యేసురత్నం, కుంభ రవిబాబు, చక్రవర్తి, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ముస్తఫా, ఎంపీ విజయ సాయి రెడ్డి హాజరు
06:19PM, Jan 29, 2024
సిగ్గులేకుండా చంద్రబాబు తిరుగుతున్నారు: మంత్రి కారుమూరి
- చంద్రబాబు నిజాలు మాట్లాడితే తలకాయ్ వెయ్యి చెక్కలు అవుతాదని రాజశేఖర్ రెడ్డి ఆనాడే చెప్పారు
- చంద్రబాబు జీవితమంతా అవినీతి అబద్ధాలమయం
- చంద్రబాబు మీటింగ్ లకు జనాలే కరువయ్యారు
- చంద్రబాబునీ జనాలు ఛీ కొడుతున్న సిగ్గువిడిచి తిరుగుతున్నాడు
- గతంలో రాష్ట్రానికి మేలుకు జరగకపోయినా చంద్రబాబు ఖజానా నిండింది
- రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి కమిటీలు చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని స్థానికంగా దోచేశారు
- చంద్రబాబు అబద్దాలను ఆదర్శంగా తీసుకుని తణుకు మాజీ ఎమ్మెల్యే కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు
- 2019 ఎలక్షన్ ముందు బడ్జెట్లో బిల్లు మంజూరు చేయించి వదిలేస్తే
- 2019 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 6కోట్ల రూపాయలతో 30 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేశాం
- వేల్పూరు హాస్పటల్ బిల్లు 25% దాటి బిల్లు చేయించలేకపోయిన మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి
- వేల్పూరు గత ప్రభుత్వంలో 36 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు
- మా ప్రభుత్వంలో వేల్పూర్ కి 158 కోట్లు ఖర్చు చేశాం
- ప్రజలకు మేలు చేసే మనస్తత్వం టిడిపి వారికి లేదు
- వేల్పూరు మనిషిగా వేల్పూర్ కు ద్రోహం చేసింది ఆరిమిల్లి
- వేల్పూరు గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే మీసం తీయించుకుంటా అన్నావ్?
- రాధాకృష్ణ ఇప్పుడు బీసీ కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నాము మీసం తీయించుకో?
- రాధాకృష్ణ నీకు తణుకు సీటు లేని పరిస్థితి, ముందు నీ సీట్ గురించి నువ్వు చూసుకో
- వేల్పూర్ అభివృద్ధి విషయంలో చర్చకు నువ్వు సిద్ధమా?
06:05PM, Jan 29, 2024
భువనేశ్వరీకి మళ్లీ నిజం గుర్తుకొచ్చింది
- రేపటి నుంచి 4 రోజులపాటు భువనేశ్వరి ‘నిజం గెలవాలి ’ పర్యటన
- చంద్రబాబు అరెస్టు తర్వాత మనస్తాపంతో కొందరు చనిపోయారని అప్పట్లో ఎల్లోమీడియా ప్రచారం
- ఆ కుటుంబాలను పరామర్శిస్తానని బయల్దేరిన భువనేశ్వరీ
- ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చెక్కు ఇస్తోన్న భువనేశ్వరీ
- తొలుత రెండు రోజులు పర్యటించి సుదీర్ఘ విరామం ఇచ్చిన భువనేశ్వరీ
- తీవ్ర విమర్శలు రావడంతో మళ్లీ పర్యటనలు పునఃప్రారంభం
- రేపు బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో భువనేశ్వరి పర్యటన
- రేపల్లే, పర్చూరు, ఒంగోలులో భువనేశ్వరి పర్యటన
- ఈనెల 31న దర్శి, కొండపి, కందుకూరులో భువనేశ్వరి పర్యటన
- ఫిబ్రవరి 1న కందుకూరు, ఉదయగిరి, నెల్లూరులో భువనేశ్వరి పర్యటన
- ఫిబ్రవరి 2న వెంకటగిరి, ఆత్మకూరులో భువనేశ్వరి పర్యటన
05:45PM, Jan 29, 2024
తీర్పు ఎలా ఉండనుందో?
- వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ల పై వాదనలు పూర్తి
- స్పీకర్ నిర్ణయం తీసుకున్నారో, లేదో కనుక్కుని చెప్పాలని ఆదేశించిన హైకోర్టు
- ఆ అంశం పరిశీలన తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్న హైకోర్టు
- ఇవాళే నిర్ణయం వెల్లడిస్తామన్న ఏపీ హైకోర్టు
- తమకు ఇచ్చిన నోటీసులతో పాటు పేర్కొన్న డాక్యుమెంట్లు తమకు ఇవ్వలేదని చెప్పిన పిటిషనర్ల తరపు న్యాయవాదులు
- తమ అభ్యర్ధనలను పక్కన పెట్టి విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారని వివరించిన న్యాయవాదులు
- స్పీకర్ ఎదుట హాజరుకాని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే
- విదేశాల్లో ఉన్నందున సమయం కోరిన మద్దాలి గిరి
04:38PM, Jan 29, 2024
జగన్ను మళ్లీ గెలిపిస్తేనే..
- చంద్రబాబు ఏనాడూ వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు
- చంద్రబాబు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు
- చరిత్రపుటల్లో కలిసిపోయిన పార్టీ కాంగ్రెస్
- ఏపీకి కాంగ్రెస్, సోనియాగాంధీలు తీరని ద్రోహం చేశారు
- తరతరాలు ఆ ద్రోహాన్ని గుర్తుంచుకుంటాయి
- సామాజిక సాధికార యాత్ర దేశంలోనే ఎవరూ చేయని ఓ అద్భుతమైన కార్యక్రమం
- వచ్చే ఎన్నికలు ధనికులకు.. పేదవారికి మధ్య జరిగే ఓ రెఫరండమని అన్నారు.
- ఈ యుద్ధంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు పేదవారి పక్కన వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబడి వారిని గెలిపిస్తారు
- ప్రజల మధ్య సామాజిక ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలి
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరి పేట నుంచి మల్లెల రాజేశ్ నాయుడు పోటీ
వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు
04:19PM, Jan 29, 2024
రాజ్యసభలో అడ్రస్ గల్లంతు కానున్న టీడీపీ
- వచ్చే నెలలో జరిగే మూడు స్థానాలనూ దక్కించుకోనున్న వైఎస్సార్సీపీ
- సాధారణ ఎన్నికలకు ముందే రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు
- దీనిపై తీవ్ర ఆందోళనలో టీడీపీ అధినేత చంద్రబాబు
- ఏప్రిల్ 2 తో ముగియనున్న వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, టీడీపి సభ్యుడు కనకమేడల పదవీకాలం
- సంఖ్యాబలాన్ని బట్టి ఈ మూడూ వైఎస్సార్సీపీ ఖాతాలోకే
- రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైఎస్సార్సీపీ పరం
- చివరికి రాజ్యసభలో ఉనికే లేకుండాపోనున్న టీడీపీ
- 41 ఏళ్లలో టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండాపోవడం ఇదే తొలిసారి
04:12PM, Jan 29, 2024
అందుకే టీడీపీ నుంచి బయటకొచ్చా: ఎమ్మెల్యే గణేష్
- టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ విచారణ
- విచారణకు హాజరైన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్
- అనర్హత వ్యవహారంలో స్పీకర్కు వివరణ ఇచ్చిన గణేష్
- 2019లో సైకిల్ గుర్తుపై నెగ్గిన వాసుపల్లి గణేష్
- టీడీపీ పేదవాళ్లకు అన్యాయం చేస్తోందనే దూరంగా జరిగా: గణేష్
- నేను టీడీపీ నమ్మక ద్రోహం చేశానన్న ఆరోపణల్లో వాస్తవం లేదు: గణేష్
- స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా: గణేష్
04:03PM, Jan 29, 2024
రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్.. తీర్పు రిజర్వ్
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పిటిషన్
- అనర్హత వేటు నోటీసుల రద్దు కోరుతూ పిటిషన్ వేసిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ
- పిటిషన్పై ముగిసిన విచారణ
- అనర్హత వేటు నోటీసును సవాల్ చేసిన మొత్తం ఐదుగురు
- ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారంటూ వాదన
- నోటీసులు ఇవ్వడం సహజ న్యాయ సూత్రానికి విరుద్ధమంటూ ఎమ్మెల్యేల తరఫు లాయర్ల వాదన
- విచారణ ముగియడంతో.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
- దీంతో కొనసాగనున్న ఉత్కంఠ
3:42PM, Jan 29, 2024
ఏపీ హైకోర్టులో రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ
- వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ
- వాదనలు నినిపిస్తున్న ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు
- అంతకు ముందు స్పీకర్ ఎదుట ముగిసిన రెబల్ ఎమ్మెల్యేల విచారణ
- స్పీకర్కు వివరణ ఇచ్చిన నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు
- పార్టీ ఫిరాయింపుపై ఆధారాలు చూపాలన్న ఆనం, కోటంరెడ్డి
- అనర్హతపై న్యాయ సలహా తీసుకున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు
- స్పీకర్ సమయం ఇవ్వడానికి నిరాకరించారు : కోటంరెడ్డి
- స్పీకర్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తాం : కోటంరెడ్డి
- టైమ్ అడిగాం... స్పీకర్ ఏం చేస్తారో చూడాలి : ఆనం
3:21PM, Jan 29, 2024
కిందపడబోయిన చంద్రబాబు.. అసహనం
- తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కాతేరులో రా కదలిరా సభలో గందరగోళం
- రాజానగరం టికెట్ జనసేనకు ప్రకటించడంపై తీవ్ర నిరసన
- బొడ్డు వెంకటరమణ వర్గీయుల ఆందోళన
- కార్యకర్తల స్టేజిపై నుండి దూకుడుగా కిందకి దిగడంతో కిందకు పడబోయిన చంద్రబాబు
- చంద్రబాబు పడకుండా వెంటనే పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది
- సొంత పార్టీ కార్యకర్తల తీరుపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు
3:18PM, Jan 29, 2024
బాబు కుయుక్తులు.. నారాయణకు ఏం పని?
- ఎన్నికల ముంగిట చంద్రబాబు చేయని కుయుక్తులు లేవు
- ఎన్ని అక్రమాలు చేసైనా గెలవాలని కుట్రలు పన్నుతున్నారు
- నారాయణ విద్యాసంస్థలతో ప్రజల వ్యక్తిగత డేటా సేకరిస్తున్నారు
- విద్యార్థుల తల్లిదండ్రులు, వారి బంధువుల ఓటర్ ఐడీ నెంబర్లు, పోలింగ్ బూత్ ల వివరాలు సేకరిస్తున్నారు
- ఆ వివరాలతో నారాయణకు ఏంపని?
- ఏ కుట్రలు, కుతంత్రాలు లేకపోతే ఆ వువరాలను చట్టవిరుద్ధంగా ఎందుకు సేకరిస్తున్నారు?
- రాష్ట్రంలో విద్యని వ్యాపారం చేసినదే కాకుండా రాజకీయం కూడా చేయటమేంటి?
- ప్రజల వ్యక్తిగత డేటా సేకరిస్తున్నారనేదానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి
- వాటిని ఎలక్షన్ కమీషన్ కి ఫిర్యాదు రూపంలో అందించాం
- దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నారాయణ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి
సాక్షి టీవీతో వైఎస్సార్సీపీ లేళ్ల అప్పిరెడ్డి
3:16PM, Jan 29, 2024
బాబు దృష్టిలో సంక్షేమం అంటే.. సన్ క్షేమం
- అధికారం కోసం ఏమైనా చేసే వ్యక్తి చంద్రబాబు
- ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో ఆయనకే తెలియదు
- స్థానికంగా ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే.. చంద్రబాబు చదువుతున్నారు
- 2019లోనే ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పారు
- సంక్షేమం అంటే ఏంటో తెలియని వ్యక్తి చంద్రబాబు
- చంద్రబాబు దృష్టిలో సంక్షేమం అంటే.. తన సన్ క్షేమం
- అధికారం కోల్పోయాక ఆయన మానసిక స్థితి దెబ్బతింది
- చంద్రబాబుకి సామాజిక న్యాయం అనే పదానికి అర్థం తెలియదు
- బాబుకు బుద్ధి చెప్పేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు
రాజమహేంద్రవరంలో మంత్రి చెల్లుబోయిన వేణు వ్యాఖ్యలు
3:06PM, Jan 29, 2024
కోర్టు ఏం చెబుతుందో?
- కాసేపట్లో ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విచారణ
- అనర్హత వేటు నోటీసులు రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య
- లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు
- కోర్టు ఏం చెబుతుందా? అనే దానిపై ఉత్కంఠ
2:50PM, Jan 29, 2024
ప్రొద్దుటూరు టీడీపీలో ఆ నలుగురి లొల్లి
- ప్రొద్దుటూరు అసెంబ్లీ సెగ్మెంట్ కోసం తెలుగు దేశం పార్టీలో గొడవ
- టికెట్ కోసం కొట్టుకుంటున్న ఆ నలుగురు
- మాజీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, లింగారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలతో పాటు ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సురేష్ నాయుడు కూడా
- ఎవరికి వారే లాబీయింగ్లు నడుపుతూ.. సీటు తమదేనంటూ ప్రచారం చేసుకుంటున్న వైనం
2:05PM, Jan 29, 2024
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
- దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
- ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు
- ఫిబ్రవరి 8 వతేదీన నోటిఫికేషన్.. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్
1:50PM, Jan 29, 2024
నారాయణ విద్యా సంస్థలపై ఎన్నికల కమిషన్కు వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు
- నారాయణ విద్యా సంస్థలు ద్వారా ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారని ఫిర్యాదు
- విద్యార్థుల వ్యక్తిగత, సున్నిత సమాచారాన్ని సేకరిస్తున్న నారాయణ విద్యాసంస్థల సిబ్బంది
- నారాయణ స్కూళ్ళు, జూనియర్ కళాశాల విద్యార్థులు కుటుంబాల సమాచారం సేకరిస్తున్నారని ఫిర్యాదు
- మాజీ మంత్రి నారాయణ పై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
- టీడీపీ నుండి పోటీ చేస్తున్న నారాయణ తన విద్యాసంస్థల ద్వారా ఓటర్ల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని ఫిర్యాదు
1:42PM, Jan 29, 2024
రాజమండ్రి రూరల్ కాతేరులో చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ
- చంద్రబాబు మాట్లాడుతుండగానే పెద్ద సంఖ్యలో తిరిగి వెళ్లిపోతున్న ప్రజలు
- ఖాళీగా దర్శనం ఇస్తున్న కుర్చీలు
- యధావిధిగా జనాలకు అబద్దాలు వల్లే వేస్తున్న చంద్రబాబు
- రాజమండ్రి రూరల్లో తమ అభ్యర్థి విషయం గురించి ప్రస్తావించని చంద్రబాబు
1:09PM, Jan 29, 2024
రాజమండ్రి ఎయిర్పోర్ట్ వద్ద చంద్రబాబుకు వేరువేరుగా జై కొట్టిన టీడీపీ-జనసేన శ్రేణులు
- ఇరు పార్టీల నేతలకు వేరు వేరుగా నినాదాలు
- పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా రాజానగరం నుండి జనసేన పోటీ చేస్తుందని చేసిన ప్రకటనపై టీడీపీ శ్రేణులు అసంతృప్తి
- పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేసిన టీడీపీ శ్రేణులు
- చంద్రబాబు ఎదుటే బయటపడిన రెండు పార్టీల విభేదాలు
1:07 PM, Jan 29 2024
రాజమండ్రి రూరల్లో బయటపడిన టీడీపీ- జనసేన కార్యకర్తల మధ్య విభేదాలు
- చంద్రబాబును ఆహ్వానించేందుకు విడివిడిగా ఏర్పాటుకు వెళ్లిన టీడీపీ జనసేన కార్యకర్తలు
- మరోవైపు జనం లేకపోవడంతో వెలవెలబోతున్న చంద్రబాబు సభా ప్రాంగణం
1:05 PM, Jan 29 2024
ఒక్క కాపుకు అయినా చంద్రబాబు, పవన్ మేలు చేశారా?
- ఏలూరు జిల్లాలో కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న కాపులంతా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు
- సీఎం జగన్మోహన్ రెడ్డి కాపులలో 30 మంది ఎమ్మెల్యేలు గా గెలిపించుకున్నారు
- ఐదుగురికి మంత్రులు ఇచ్చి 150 మంది కాపు సోదరులకు రాజకీయంగా పదవులు ఇచ్చారు
- నాడు కాపులను వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆదుకున్నారు నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు...
- 2014 నుండి జనసేనలో కాపులు ఇబ్బంది పడుతున్నారు
- కాపులు నా వైపు రండి చక్కగా చూస్తానంటూ పవన్ కళ్యాణ్ అంటున్నాడు
- పవన్ కళ్యాణ్ ఒక్కడే టీడీపీని అనుసరించి కమ్మగా ఉన్నాడు...
- అయినా పవన్ కళ్యాణ్ సీటు ఎక్కడో చంద్రబాబు చెప్పడం లేదు
- రాష్ట్రంలో మేలు చేసే వ్యక్తి ఎవరో.? కీడు చేసే వ్యక్తి ఎవరో? కాపులు ఆలోచించాలి
- మొన్నటివరకు పవన్ కళ్యాణ్ ని పాకేజి స్టార్గా చంద్రబాబు వాడుకున్నారు.
- రాష్ట్రానికి పట్టిన చీడ చంద్రబాబు... పీడ పవన్ కళ్యాణ్..
- చంద్రబాబు పవన్ కళ్యాణ్లను వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు
1:00 PM, Jan 29 2024
ఇదేమి పని కన్నా..?
- పల్నాడు జిల్లా: తొండపి రాళ్ల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించిన మంత్రి అంబటి రాంబాబు
- నేను 12 సంవత్సరాల నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నా
- కన్నా రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నాడు, ఇది చాలా దురదృష్టకరం
- కన్నా మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను
- సత్తెనపల్లి లో ఉన్న రౌడీలని వెంట తీసుకుని వెళ్ళాడు
- వారు YSRCP వారిపై దాడి చేయాలని ప్రయత్నం చేశారు
- ఘర్షణలను, అన్యాయాలను ఉక్కు పాదంతో అణిచివేస్తాం
12:50 PM, Jan 29 2024
పొత్తులో మాకు 60 సీట్లు ఇవ్వాల్సిందే.!
- సత్తెనపల్లి జనసేన ఇన్ ఛార్జ్ బొర్రా వెంకట అప్పారావు కీలక వ్యాఖ్యలు
- కన్నా లక్ష్మీనారాయణ తీరుపై విమర్శలు
- ఎవరికి వాళ్లు తామే అభ్యర్థులనుకుంటే కుదరదు
- పవన్ చెప్పినట్టు.. మూడో వంతుగా 60 సీట్లు జనసేనకు రావాలి
- పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించాలి
12:46 PM, Jan 29 2024
రాజమండ్రిలో ఎవరి దారి వారిదే
- రాజమండ్రిలో బయటపడ్డ టీడీపీ - జనసేన విభేదాలు
- ఎయిర్ పోర్టు ముందు విడిపోయిన రాజానగరం టీడీపీ, జనసేన శ్రేణులు
- రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తుందన్న పవన్ ప్రకటనపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి
12:45 PM, Jan 29 2024
ఎన్నికల యుద్ధానికి సిద్ధం : పెద్దిరెడ్డి
- తిరుపతిలో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- పాల్గొన్న ఏడు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి ఎమ్మెల్యేలు
- రాబోయే వారంరోజుల్లో జరిగే క్యాడర్ మీటింగ్పై చర్చ
- రాయలసీమలో 50 స్థానాల్లో గెలవడానికి సమాయత్తం అవుతున్నాం
- ఈ సమావేశానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు అవుతారు,
- ఎన్నికల యుద్దానికి సిద్దం పోస్టర్ ఆవిష్కరించాము
- రాయలసీమ ప్రాంతం నుంచి భారీగా ప్రజలు తరలి వస్తారు
ఆర్.కే.రోజా, మంత్రి
- నాన్ లోకల్ పొలిటీషియన్ లను ప్యాక్ చేసి హైదరాబాద్ కు పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- రాయలసీమ ప్రాంతం నుంచి అత్యధికంగా సీట్లు గెలిచి జగన్ అన్నకు ఇస్తాం
- ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం
- చంద్రబాబు ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసిన మోసగాడు
- చంద్రబాబు నాయుడు పచ్చ ఛానెల్స్ ద్వారా విషం చిమ్ముతున్నాడు
- చంద్రబాబు మాట్లాడే మాటలు ఫ్రస్ట్రేషన్కు పరాకాష్ట
- రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
- వేసుకున్న డ్రెస్ కాంగ్రెస్, స్క్రిప్ట్ చంద్రబాబు ది అనేది షర్మిలను ప్రజలు గమనిస్తున్నారు
- తెలంగాణ లో పార్టీ పెట్టీ, కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిలకు ప్రజల్లో క్రెడిబిలిటి లేదు
- ఓటు కు నోటు కు దొంగ లా దొరికిపోయిన దొంగ చంద్రబాబు.. మా పార్టీ గురించి మాట్లాడటం సిగ్గు చేటు
- ఆంధ్ర జ్యోతి పేపర్ కు మాపై ప్రేమ ఎక్కువ, ఎంపి సీట్లకు పేర్లు ప్రకటిస్తున్నారు,
- పార్టీ ఆదేశిస్తే ఎక్కడినుంచి అయినా పోటీకి సిద్దం
12:30 PM, Jan 29 2024
విచారణకు సహకరించకుంటే బెయిల్ రద్దు కోరండి
- ఢిల్లీ: ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ
- విచారణ చేసిన జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం
- బాబు దర్యాప్తుకు సహకరించకపోతే బెయిల్ రద్దుకు తమను ఆశ్రయించాలని సుప్రీం ఆదేశం
- ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ లో విజ్ఞప్తి
- ఏపీ ప్రభుత్వ పిటిషన్లో ముఖ్యమైన అంశాలు
- G 2 G పేరుతో నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెట్టారు
- ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో అక్రమంగా మార్పులు చేశారు
- తమ భూములకు అనుకూలంగా రోడ్డు మార్పులు చేశారు
- దీనికి ప్రతిఫలంగా పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నారు
- ఈ కుంభకోణానికి ముఖ్య సూత్రధారి చంద్రబాబు, నాటి మున్సిపల్ మంత్రి నారాయణ
- తమకు ముడుపులు ఇచ్చిన వారిని దుబాయ్, అమెరికాకు పారిపోయేలా సహకరించారు
- ముందస్తు బెయిల్ వల్ల కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతున్నారు
- నోటీసులు అందుకున్న నిందితులు ఇప్పటికే కొంతమంది పరారయ్యారు
12:22 PM, Jan 29 2024
ఏలూరులో జన ప్రభంజనమే : మిథున్
- ఏలూరులో YSRCP రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి
- ఫిబ్రవరి మూడో తేదీ ఏలూరు లో క్యాడర్ మీటింగ్ కు సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారు
- ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల క్యాడర్ ఈ మీటింగ్ లో పాల్గొంటారు
- లక్షలాదిమంది ఈ మీటింగ్ కు రానున్నారు
- రాబోయే ఎన్నికలకు క్యాడర్ కు సీఎం దిశా నిర్దేశం చేస్తారు
- రాబోయే ఎన్నికల్లో సైతం ఈ మూడు జిల్లాల్లో పార్టీ విజయ ఢంకా మోగిస్తుంది
- వైఎస్ఆర్సీపీ శ్రేణులు పార్టీ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం..
ఏలూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆళ్ళ నాని
- ఫిబ్రవరి మూడో తేదీ రెండు గంటల సమయంలో ఏలూరులో మూడు జిల్లాల కార్యకర్తల విస్తృత సమావేశం
- ఉభయ గోదావరి, కృష్ణా,మూడు ఉమ్మడి జిల్లాల కార్యకర్తల మహాసభ జరుగుతుంది
- మూడు జిల్లాల నుండి లక్షలాదిగా కార్యకర్తలు తరలి రాబోతున్నారు
- సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సందేశం ప్రతి వైఎస్ఆర్సిపి కార్యకర్తకు చేరేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము..
- ఉమ్మడి గోదావరి జిల్లాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఎన్ని కుట్రలు చేయబోతున్నారో కార్యకర్తలు గమనిస్తున్నారు
- పవన్ కళ్యాణ్ కులాలు అడ్డుపెట్టుకుని ఓట్లు దండుకోవాలని ఈ రెండు జిల్లాల మీదే యాత్రల పేరుతో హడావిడి చేశారు
- సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసే పోరాటాలకు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ అండగా ఉంటారు
- 175 నియోజకవర్గాలకు 175 గెలిపించేలా జగనన్న భరోసా కల్పించనున్నారు
- చంద్రబాబు చేసే విమర్శలు ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు.
12:16 PM, Jan 29 2024
తప్పుడు రాతల రామోజీకి శిక్ష తప్పదు
- ఈనాడు పత్రిక పై అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఫైర్
- అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి సెంటర్లో ఈనాడు దినపత్రికను దగ్ధం చేసిన వైసీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
- వయసు పెరుగుతున్నా ఈనాడు రామోజీరావు దుర్మార్గపు రాతలు ఆపడం లేదు
- రామోజీరావు దుర్మార్గపు చేష్టలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి
- అధిష్టానానికి నేను ధిక్కార స్వరం వినిపించానని ప్రచారం చేస్తున్నారు
- నేను సీఎం జగన్ గీసిన గీతను దాటను
- ఎంపీ గా పోటీ చేయమంటే పోటీ చేస్తా
- ఎమ్మెల్యే గానే పోటీ చేయమంటే ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా
- వేరే ఎవరినైనా పోటీ చేయమని ఆదేశిస్తే వారి వెంటే ఉంటా..గౌరవంగా స్వీకరిస్తా
- చంద్రబాబు కూయమన్న కూతలే రామోజీరావు కూస్తున్నాడు
- నా మీద తప్పుడు రాతలు రాస్తే రాసినవారే ఇబ్బందిపడతారు
12:17 PM, Jan 29 2024
ప్రజలే మాకు స్టార్ కాంపెయినర్లు : దేవినేని అవినాష్
- విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మాట్లాడిన దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ
- రాష్ట్ర ప్రజలే జగన్ ప్రభుత్వానికి స్టార్ క్యాంపెయినర్లు
- చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ ఎన్ని చిల్లర వేషాలు వేసినా ఉపయోగం లేదు
- తెలుగుదేశం నాయకులు పచ్చ పత్రికల ద్వారా జగన్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారు
- సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలా జగన్ పాలన సాగుతోంది
- రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ,పవన్ లకు ప్రజలే బుద్ధి చెబుతారు
- ప్రతి గడప నుంచి జగన్ ప్రభుత్వానికి ప్రజాదరణ అందుతోంది
- పథకాలు పొందుతున్న ప్రతి ఒక్కరు జగన్ ప్రభుత్వం వెంటే ఉంటారు
12:16 PM, Jan 29 2024
తప్పుడు రాతల రామోజీకి శిక్ష తప్పదు
- ఈనాడు పత్రిక పై అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఫైర్
- అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి సెంటర్లో ఈనాడు దినపత్రికను దగ్ధం చేసిన వైసీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
- వయసు పెరుగుతున్నా ఈనాడు రామోజీరావు దుర్మార్గపు రాతలు ఆపడం లేదు
- రామోజీరావు దుర్మార్గపు చేష్టలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి
- అధిష్టానానికి నేను ధిక్కార స్వరం వినిపించానని ప్రచారం చేస్తున్నారు
- నేను సీఎం జగన్ గీసిన గీతను దాటను
- ఎంపీ గా పోటీ చేయమంటే పోటీ చేస్తా
- ఎమ్మెల్యే గానే పోటీ చేయమంటే ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా
- వేరే ఎవరినైనా పోటీ చేయమని ఆదేశిస్తే వారి వెంటే ఉంటా..గౌరవంగా స్వీకరిస్తా
- చంద్రబాబు కూయమన్న కూతలే రామోజీరావు కూస్తున్నాడు
- నా మీద తప్పుడు రాతలు రాస్తే రాసినవారే ఇబ్బందిపడతారు
12:15 PM, Jan 29 2024
విచారణకు హాజరు కానున్న నేతలు వీరే
- ఫిరాయింపు వ్యవహారంపై రెండు పార్టీల ఫిర్యాదు
- వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
- YSRCP ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు : ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి
- YSRCP ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ : టీడీపీకి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్సీ రామచంద్రయ్య
- TDP ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు : కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీమోహన్, వాసుపల్లి గణేష్
- స్పీకర్ నిర్ణయం ఆధారంగా తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్న నేతలు
12:10 PM, Jan 29 2024
మండలిలో నేడే కీలక నిర్ణయం
- విజయవాడ : అనర్హత పిటిషన్లపై నేడు విచారణ
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే నోటీసులు
- ఈ రోజు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని నోటీసులు
- ఎమ్మెల్సీలను విచారించనున్న మండలి ఛైర్మన్ మోషేన్ రాజు
11:50 AM, Jan 29 2024
మండపేట సైకిల్కు మంట
- కోనసీమ: మండపేట టీడీపీలో అసమ్మతి
- ఎమ్మెల్యే జోగేశ్వరరావు వ్యతిరేకుల సమావేశం
- ఎమ్మెల్యే పై క్యాడర్ తీవ్ర అసంతృప్తి
- ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని డిమాండ్
- మండపేటలో పోటీ చేస్తానంటున్న నెక్కంటి బాలకృష్ణ
- మండపేట టికెట్ నెక్కంటి బాలకృష్ణకు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన కార్యకర్తలు
11:45 AM, Jan 29 2024
రాజోలులో రాజెవరు? మంత్రెవరు?
- రాజోలు టీడీపీ కార్యకర్తల్లో గందరగోళం
- రాజోలులో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించడంతో అలజడి
- అనుచరులు, కేడర్ తో గొల్లపల్లి సూర్యారావు సమావేశం
- రెండ్రోజుల క్రితం మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో నిరసన తెలిపిన గొల్లపల్లి అనుచరులు
- రాజోలులో టీడీపీ పోటీ చేయాలని, గొల్లపల్లికే టికెట్ ఇవ్వాలని డిమాండ్
11:41 AM, Jan 29 2024
పులివెందులలో కాంగ్రెస్ రాజకీయం
- మొరుసుపల్లి షర్మిలతో నర్రెడ్డి సునీతా భేటీ
- షర్మిలతోపాటు కడపకు బయలుదేరిన సునీత
- ఒకే వాహనంలో కడపకు షర్మిల, సునీత
- కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొననున్న సునీత
11:35 AM, Jan 29 2024
ఫిరాయింపు ఎమ్మెల్యేల కొత్త సాకులు
- అర్జంటుగా కొత్త సాకులు చెబుతున్నా ఫిరాయింపు ఎమ్మెల్యేలు
- నాకు కోవిడ్ వచ్చింది.. నేను కొవిడ్ తో బాధపడుతున్నా: ఉండవల్లి శ్రీదేవి
- ఇంకా సెలైన్ పెట్టుకుంటూనే ఉన్నా : ఉండవల్లి శ్రీదేవి
- కోవిడ్ తగ్గే దాకా సమాధానం ఇవ్వడానికి సమయం కావాలి : ఉండవల్లి శ్రీదేవి
- నాకు నోటీసిచ్చిన 2 వారాల్లోనే సమాధానం ఇవ్వమంటున్నారు : ఆనం రాంనారాయణ రెడ్డి
- నేను క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయా? : ఆనం రాంనారాయణ రెడ్డి
- నా అనారోగ్యం పై వైద్యుల నివేదికిచ్చినా స్పీకర్ పట్టించుకోలేదు: మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
- స్పీకర్ ను కలిసి మళ్లీ సమయం కోరతా : మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
- విప్ ఉల్లంఘించామనడానికి వాళ్ల వద్ద ఉన్న ఆధారాలేమిటి? : మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించామని ఎలా నిర్ధారించారు : మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
- రహస్య ఓటింగ్ లో విప్ ఉల్లంఘించారని ఎలా చెబుతారు?: మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
11:22 AM, Jan 29 2024
అనర్హతపై ఏమంటారు?
- ఏపీ స్పీకర్ ముందుకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు
- అసెంబ్లీకి చేరుకున్న ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి
- స్పీకర్ కు వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు
- విచారణ సందర్భంగా మెమో దాఖలు చేయనున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు
- సమయం కావాలంటూ మరోసారి స్పీకర్ను ప్రత్యక్షంగా కోరనున్న వైసీపీ రెబల్స్
- న్యాయ నిపుణులతో సంప్రదించేందుకు, పేపర్, వీడియో క్లిప్పింగుల జన్యూనిటీ నిర్ధారణకు సమయం అవసరమంటోన్న వైసీపీ రెబల్స్
- పిటిషన్ దాఖలు తర్వాత రిప్లైకి 30 రోజుల సమయం కోరనున్న వైసీపీ రెబల్స్
- సహజ న్యాయ సూత్రాల ప్రకారం వెసులుబాటు కల్పించాలని కోరనున్న వైసీపీ రెబల్స్
11:15 AM, Jan 29 2024
నా రాజీనామా ఆమోదించారండి : హైకోర్టుకు గంటా
- ఏపీ హైకోర్టు: తన రాజీనామా ఆమోదాన్ని సవాలు చేస్తూ గంటా శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ
- కౌంటర్ వేయాలని స్పీకర్, న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం
- తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా
- తన రాజీనామాను నిభందనలు ప్రకారం అనుమతించలేదని పిటిషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
11:00AM, Jan 29 2024
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ
- ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని విచారణ
- పార్టీ ఫిరాయింపు పిటీషన్పై విచారణకు హాజరైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
10:30AM, Jan 29 2024
టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వేను నమ్మని పార్టీ నాయకులు..
- పాడేరులో టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే ఫేక్ సర్వే అంటూ నేతలు మండిపాటు..
- డబ్బులు ఉన్న వారి పేర్లనే సర్వేలో పెడుతున్నారని నేతలు ఆగ్రహం.
- పాడేరులో ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా రమేష్ నాయుడు గిడ్డి ఈశ్వరి పేర్లపై ప్రజాభిప్రాయ సేకరణ.
- సర్వేలో మాజీ మంత్రి మణి కుమారి, మాజీ జడ్పీ చైర్పర్సన్ కాంతమ్మ ఎంవీఈ ప్రసాద్ పేర్లు లేకపోవడంపై అసంతృప్తి..
- ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తనను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని గిడ్డి ఈశ్వరి అనుమానం..
- దామచర్ల సత్యకు ఫండ్ ఇవ్వడం వలనే రమేష్ నాయుడు పేరు పరిశీలన అంటూ విమర్శలు..
- టీడీపీ కష్టపడిన వారికి గుర్తింపు లేదంటూ ఆవేదన..
9:30AM, Jan 29 2024
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
- నేడు సుప్రీంకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ
- విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం
- ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ లో విజ్ఞప్తి
- నిబంధనలు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టారు
- ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తమకు అనుగుణంగా మలుపులు తిప్పారు
- అందులో పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అయింది
- ఈ వ్యవహారంలో వచ్చిన డబ్బును నిందితులు దుబాయ్ కి తరలించారు
- ముందస్తు బెయిల్ వల్ల కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతున్నారు
- నోటీసులు అందుకున్న నిందితులు ఇప్పటికే కొంతమంది పరారయ్యారు
- పిటిషన్ లో ఏపీ ప్రభుత్వ వాదనలు
8:30AM, Jan 29 2024
నేడు ఏపీ స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు
- అనర్హత పిటిషన్లపై నేడు విచారణ
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే నోటీసులు
- ఈరోజు వ్యక్తిగత విచారణకు హాజరవ్వాలని నోటీసులు
- ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా విచారించనున్న స్పీకర్ తమ్మినేని
- ఎమ్మెల్సీ లను విచారించనున్న శాసనమండలి చైర్మన్ నోటీసులు
7:30AM, Jan 29 2024
కిక్కిరిసిన కోట
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అండగా సీఎం జగన్ : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- కుటుంబాలను చీల్చడమే ఆ పార్టీల పని: అనిల్కుమార్ యాదవ్
- చంద్రబాబు ఏనాడూ బీసీలను పట్టించుకోలేదు: బీద మస్తాన్రావు
- సామాజిక సాధికార నినాదంతో మార్మోగిన కోట పట్టణం
7:25AM, Jan 29 2024
చంద్రబాబు ప్రసంగానికి కుర్చీలే అతిథులు
- నెల్లూరు, పత్తికొండలో ‘రా.. కదలిరా‘ సభలు అట్టర్ ఫ్లాప్
- లక్ష మంది హాజరవుతారని టీడీపీ నాయకుల అంచనా
- నిండా ఏడెనిమిది వేల మంది కూడా హాజరు కాని పరిస్థితి
- చంద్రబాబు మాట్లాడుతుండగానే వెళ్లిపోయిన ప్రజలు
- జగన్ను ఓడించడానికి 5 కోట్ల మంది కలిసి రావాలని పిలుపు
- జన సమీకరణలో విఫలంపై స్థానిక నేతలకు బాబు చీవాట్లు
7:10AM, Jan 29 2024
దమ్ముంటే నాపై పోటీ చెయ్: కేశినేని నాని
- చంద్రబాబుకు విజయవాడ ఎంపీ కేశినేని నాని సవాల్
- తెలుగుదేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలు
- లోకేశ్ను ముఖ్యమంత్రిని చేయడమే బాబు అజెండా
- తోటమూలలో మాట్లాడిన కేశినేని నాని
6:50AM, Jan 29 2024
చెప్పిందేదీ చేయకపోవడమే చంద్రబాబు నైజం: బుగ్గన
- చెప్పిందేదీ చేయకపోవడమే చంద్రబాబు నైజం
- ఇచ్చిన మాట తూ.చ తప్పకుండా పాటించడం సీఎం జగన్ నైజం
- నంద్యాల జిల్లా డోన్లో రూ.102 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్
6:45AM, Jan 29 2024
పవన్ ప్రకటనపై భగ్గుమన్న టీడీపీ
- సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు
- రాజోలు నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తారన్న ప్రకటనపై ఆగ్రహం
- వైఎస్సార్సీపీలో చేరాలని మాజీ మంత్రి గొల్లపల్లికి సూచన
- ఇండిపెండెంట్గా పోటీ చేయాలన్న మరికొందరు
6:40AM, Jan 29 2024
తీగ లాగితే.. టీడీపీ కదిలింది
- గుంటూరులోని నోవా అగ్రిటెక్ కంపెనీ భారీ ఆర్థిక అక్రమాలకు అడ్డా
- జీఎస్టీ ఎగవేతపై తనిఖీలు చేస్తే నల్ల డబ్బు కథ బహిర్గతం
- అక్రమాలకు కేరాఫ్ ‘టీడీపీ’ ఎమ్మెల్యే ఏలూరి కంపెనీ
- దర్యాఫ్తునకు సహకరించని నోవా అగ్రిటెక్.. డీఆర్ఐ సమన్లు
- ఛార్జ్షీట్ నమోదుకు కోర్టులో బాపట్ల పోలీసుల పిటిషన్ దాఖలు
- రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) తనిఖీల్లో వెల్లడైంది.
6:30AM, Jan 29 2024
అమరావతి దేశంలో అతిపెద్ద భూస్కామ్
- అమరావతి దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం
- స్వప్రయోజనం కోసం రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టిన చంద్రబాబు
- చంద్రబాబు ఆరాటమంతా ఆ వర్గం కోసమే
- మీడియాలోని ఓ వర్గం కూడా ఆయనకు జత కలవడంతో రాష్ట్రానికి ముప్పు
- రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత బాబుదే
- ‘భ్రమరావతి కథలు’ పుస్తకావిష్కరణ సభలో మేధావులు, సామాజికవేత్తలు