కోల్సిటీ/కమాన్పూర్: నేరస్తులకు శిక్ష పడేలా చే యడంలో కోర్టుడ్యూటీ, లైజనింగ్ పోలీసు అధికారుల పాత్ర కీలకమని రామగుండం సీపీ అంబర్ కి శోర్ ఝా అన్నారు. సీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా పనిచేసిన వారిని సత్కరించారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, వర్టికల్ ఇన్చార్జి దేవయ్య, అధికారులు కిరణ్, అనిల్కుమార్, చంద్రశేఖర్గౌడ్, వినీత, సంతోష్, సందీప్ ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులకు రిఫ్లెక్టివ్ బెల్ట్లు, బాడీ బెల్ట్లు పంపిణీ చేశారు. ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. పెంచికల్పేటలో శనివారం రాత్రి కమ్యూనిటీ కాంట్రాక్ట్ నిర్వహించారు. ఏసీపీ రమేశ్, సీఐలు ప్రసాదరావు, లింగమూర్తి, అఫ్జలోద్దిన్, ఎస్సైలు పాల్గొన్నారు.


