ఉపాధికి మంగళం
పెద్దపల్లి : బడ్జెట్లో ఉపాధిహామీకి అరకొరగా నిధులు కేటాయించడంతో పథకానికి మంగళం పాడతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. యువతకు ప్రోత్సాహం అంతంత మాత్రమే ఉంది. – విజయరమణారావు, ఎమ్మెల్యే పెద్దపల్లి
తెలంగాణను పట్టించుకోలే
మంథని: బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణపై వివక్ష చూపుతోంది. ప్రస్తుత బడ్డెట్తో ఇది మరోసారి రుజువైంది. సీఎం రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో దోస్తీ చేసినా నిధులు తీసుకురాలేకపోయారు.
– పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యే, మంథని
గ్రీన్ఎనర్జీకి నిధులేవి?
పెద్దపల్లిరూరల్: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గ్రీన్ఎనర్జీ పీఎం కుసుమ్ ద్వారా రైతులకు సోలార్ ప్రయోజనం అందించేందుకు రూ.17వేల కోట్లే కేటాయించడం విచారకరం. కనీసం రూ.40వేల కోట్లు కేటాయించాలి. వికసిత్ భారత్ అంటూ రూ.53.50లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపించారు.
– ఈద శంకర్రెడ్డి, ఏడీసీ మాజీ చైర్మన్
ఉపాధికి మంగళం
ఉపాధికి మంగళం


