‘సురక్ష’తో సురక్షితం
క్యూ ఆర్కోడ్ ట్రాక్చేసే సురక్ష బ్యాండ్తో పిల్లల కదలికలను తెలుసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మేడారం జాతరకు వెళ్లే భక్తుల పిల్లలకు పెద్దపల్లి ఆర్టీసీ బస్టాండ్లో ఈ బ్యాండ్లు అందిస్తున్నారు. కోట్లాది మంది భక్తుల మధ్య పిల్లలు తప్పిపోయే అవకాశం ఉందని, వారిని ఎక్కడ ఉన్నా ఈజీగా కనిపెడతామని, ఇందుకు బ్యాండ్లు కట్టించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలు, తల్లిదండ్రుల పేర్లు, ఫోన్నంబర్లు, ఊళ్ల చిరునామాలు రికార్డుల్లో నమోదు చేసి.. ఆ తర్వాత పిల్లలకు బ్యాండ్లు అందిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
‘సురక్ష’తో సురక్షితం
‘సురక్ష’తో సురక్షితం


