ఊరంతా ఒకేసారి జెండావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఊరంతా ఒకేసారి జెండావిష్కరణ

Jan 27 2026 7:37 AM | Updated on Jan 27 2026 7:37 AM

ఊరంతా ఒకేసారి జెండావిష్కరణ

ఊరంతా ఒకేసారి జెండావిష్కరణ

మేడిపల్లి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగి త్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్‌లో ఒకే సమయానికి జెండా ఆవిష్కరించి ఆదర్శంగా నిలి చారు. ఉదయం 9 గంటలకు గ్రామంలోని అన్ని కు ల, యువజన సంఘాలు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయతీ, వాణిజ్య సముదాయాల వారు ఒకేచోటకు చేరి వారివారి ఆధ్వర్యంలో ఒకే సమయానికి జండాను ఆవిష్కరించారు. సామూహికంగా జాతీయ గీతాలాపన చేశారు. గ్రామంలో సుమా రు నాలుగు వేల మంది జనాభా ఉంటారు. జెండావిష్కరణ సమయంలో కొందరు అతిగా ప్రవర్తిస్తుండడంతో సర్పంచ్‌ సంజన ఓ కొత్త విధానానికి శ్రీకా రం చుట్టారు. గ్రామమంతా ఒకే సమయానికి జెండా ఆవిష్కరించాలని తీర్మానించారు. ఆమె మాటకు కట్టుబడిన గ్రామస్తులందరూ సరే అని సరిగ్గా 9 గంటలకు ఒకేసారి జెండా ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement