కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
పెద్దపల్లి: పెద్దపల్లి, సుల్తానాబాద్ బల్దియాలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే విజయర మణారావు అన్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శనివా రం శంకుస్థాపన చేసి మాట్లాడుతూ, పెద్దపల్లి అభి వృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తానన్నారు.
అభివృద్ధిని చూసి ఓటు వేయండి
అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వే యాలని ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. సుల్తానాబాద్లో రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. త్వరలోనే ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, మున్సిపల్ ఆఫీస్లకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. ప్రతినిధులు అంతటి అన్నయ్యగౌడ్, వినుపాల ప్రకాశ్రావు, రమేశ్, శ్రీగిరి శ్రీనివాస్, సాయిరి మహేందర్, రాజమల్లు, రాములు, రాజలింగం, తిరుపతి, కుమార్ కిశోర్, రమ, వరప్రసాద్, అబ్బయ్యగౌడ్, బిరుదు సమత, కృష్ణ, వరప్రదీప్, సునీత, రాజు, శ్రీనివాస్, రాజయ్య పాల్గొన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు


