విజయనగరం టౌన్: గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 25న తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక వైభవం పేరుతో రాష్ట్రస్ధాయి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్ధాపకుడు, శ్రీశ్రీ కళావేదిక జిల్లా కన్వీనర్ సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ప్రైవేట్ హోటల్లో శుక్రవారం ఉత్సవ నిర్వహణ చైర్పర్సన్ గురాన రాధికతో కలిసి ఆహ్వానప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25న ఉదయం 9 గంటలకు సన్స్కూల్లో జరిగే ఈ ఉత్సవానికి రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడితో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారన్నారు. కార్యక్రమంలో పి.కన్నయ్య, గొర్లె వెంకట సీతారామమూర్తి, లింగాల నరసింగరావు, డిమ్స్ రాజు, సుభద్రాదేవి, ఈపు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.


