కొమరాడ: పాలకుల మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ ఏజెన్సీలో గిరిజనుల బతుకులు మాత్రం గుంతలు దాటడం లేదు. కూటమి ప్రభుత్వం పాలనలో ప్రచార ఆర్భాటాలు మిన్నంటుతున్నాయి. క్షేత్ర స్థాయిలో గిరిజన పల్లెల కష్టాలు ఎక్కడ వేసిన గొంగిళి అక్కడే అన్న చందంగా ఉన్నా యి. ఈ నేపథ్యంలో కొమరాడ మండలం పాలెం పంచాయతీ కూస్తురు గ్రామంలో శుక్రవారం సంభవించిన ఓ హృదయ విచారక దృశ్యమే ఇందుకు సజీవ సాక్ష్యం. గ్రామానికి చెందిన తాడంగి సురేషన్ కడుపునొప్పితో పాటు కడుపు పొంగిపోవడంతో ఆనారోగ్యానికి గురయ్యాడు వెంటనే కుటుంబసభ్యులు సుమారు నాలుగు కిలోమీటర్లు డోలీ కట్టి రాళ్లరహదారిపై నడుచుకుంటూ వచ్చి కొంత దూరంలో ఆటో ఎక్కి రాయిపురం గ్రామానికి వచ్చి అక్కడినుంచి నెల్లిమర్లలోని మిమ్స్ అస్పత్రికి వెళ్లడానికి రూ.ఐదు వేలకు బొలెరో వాహనం మాట్లాడుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అటవీ శాఖ అనుమతులు రాక వందలాది గిరిజన గ్రామాలు నేటికి కనీస రవాణా సౌకర్యానికి నోచుకోవడం లేదు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులులు కోరుకుంటన్నారు.


