పేదల బతుకులపై గ్యాస్ బండ గుది బండగా మారుస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా వంట గ్యాస్ ధరలు పెరుగుతుంటే పాలకులు ఏం చేస్తున్నారో అర్ధం కావటం లేదు. కొద్ది రోజుల కిందట గ్యాస్ బండపై ఒకేసారి రూ.60 పెంచారు. ఇప్పుడు మరో రూ.29 పెంచారు. ఇది అన్యాయం. పేద, మధ్య తరగతి కుటుంబాలు రూ.వెయ్యి వరకూ చెల్లించి గ్యాస్ గొనుగోలు చేసే స్థితిలో లేవు. ప్రభుత్వం ప్రజలపై భారం లేకుండా చేయటం మానేసి రోజుకో రకంగా నిత్యవసర సరుకులపై ధరలు పెంచుతూ ప్రజలపై భారం వేయటం అన్యాయం.
పి.హైమావతి, డోలమడ,
పాలకొండ మండలం
●


