
ప్రభుత్వ కార్యక్రమాలుగా గురజాడ జయంతి, వర్ధంతి
విజయనగరం టౌన్: ప్రభుత్వ అధికార కార్యక్రమాలుగా గురజాడ అప్పారావు జయంతి, వర్ధంతులను నిర్వహించాలని జిల్లాకు చెందిన కవులు, రచయితలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక గురజాడ స్వగృహంలో సాహిత్య సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో మహాత్మా మన్నించు పేరిట సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు మాట్లాడుతూ.. తెలుగు సమాజానికి ఆధునిక ఆలోచనలందించిన మహాకవి గురజాడ అని కొనియాడారు. దేశభక్తి గీతాన్ని రాసిన మహాకవిని ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకూ అందరూ స్మరించుకుంటారు గాని ఆయన పేరిట అవార్డు మాత్రం ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. గురజాడ జయంతి, వర్ధంతిలను ఇకపై అధికారిక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
కార్యక్రమంలో సాహిత్య సంస్థల ప్రతినిధులు కాపుగంటి ప్రకాష్, డాక్టర్ జక్కు రామకృష్ణ, చీకటి దివాకర్, అధిక సంఖ్యలో సాహితీవేత్తలు పాల్గొన్నారు.
కవుల, రచయితల డిమాండ్