
అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం
పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ అధికారులతో కలసి 146 అర్జీలు స్వీకరణ
నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ ద్వారా 146 అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా, అర్జీలు రీ ఓపెన్ కాకుండా పరిష్కార చర్యలు ఉండాలన్నారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలు పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏమైనా సమస్యలు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖకు పంపాలని సూచించారు. డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.