శ్రీకాకుళం కల్చరల్: రానున్న జనవరిలో శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర స్థాయి కవి సమ్మేళనం నిర్వహించాలని తెలుగు రచయితల వేదిక(తెరవే) ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని కిల్లాన కాంప్లెక్స్ ఆవరణలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ఆర్.వి.రమణమూర్తిల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెరవే సభ్యుల కవితా రచనలతో ఓ పుస్తకాన్ని విడుదల చేయాలని మరో తీర్మానం ఆమోదించారు. సమావేశంలో రచయితలు కిల్లాన శ్రీనివాసరావు, మంగిపూడి శ్రీనివాసరావు, నిక్కు హరిసత్యనారాయణ, వావిలపల్లి రాజారావు, లలితారెడ్డి, తోట గోపాలరావు, బాలాజీ రవికిరణ్, తాళ్ళూరు విజయలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


