మల్కన్గిరి:
ఉల్లాస్–నవ భారత్ అక్షరస్యత కార్యక్రమం ద్వారా ఆదివారం మల్కన్గిరి జిల్లా కేంద్రంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ను (ఉల్లాస్) నిర్వహించారు. జిల్లాలో సుమారు 865 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం ఉల్లాస్ ప్రధాన లక్ష్యం. జిల్లా విద్యా అధికారి చిత్తరంజన్ పాణిగ్రాహి మాట్లాడుతూ.. మల్కన్గిరి జిల్లాలో అక్షరాస్యుల లక్ష్యం 35,000 మంది కాగా.. ఈ రోజు సమారు 9,603 మంది పరీక్ష రాశారన్నారు. అదనపు జిల్లా విద్యా అధికారి మంజులత భోయి పరీక్ష కేంద్రలను పర్యవేక్షించారు


