
సీనియర్ సిటిజన్ల సమస్యలు పరిష్కరించాలి
పర్లాకిమిడి: స్థానిక పెద్దరాధాకాంత మఠంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం సాధారణ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సభకు లక్ష్మీనారాయణ రోథో అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేశారు. వయోవృద్ధుల సమస్యలు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్కు ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహిని అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రోథో అభ్యర్థించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ గౌరోహరి దాస్ను ఎమ్మెల్యే రూపేష దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి హరిమోహాన్ పట్నాయక్, విశ్రాంత ఉపాధ్యాయులు గౌరహరి పండా, ఇంజినీర్ రోథో, తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ సిటిజన్ల సమస్యలు పరిష్కరించాలి