● జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ● 173 మందికి రూ.18.70 లక్షల విలువైన ఉపకరణాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

● జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ● 173 మందికి రూ.18.70 లక్షల విలువైన ఉపకరణాల పంపిణీ

Apr 29 2025 10:02 AM | Updated on Apr 29 2025 10:02 AM

● జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ● 173 మందికి రూ

● జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ● 173 మందికి రూ

అవరోధాలను అధిగమించాలి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు అవరోధాలను అధిగమించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ సూచించారు. పాఠశాల విద్యాశాఖ–సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు సోమవారం ఉపకరణాల పంపిణీ జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, అధికారులు, పాల్గొని ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన 173 మంది లబ్ధిదారులకు రూ.18.70 లక్షల విలువైన 273 పరికరాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. బ్యాటరీ ఆపరేటెడ్‌ మోటరైజ్డ్‌ ట్రైసైకిళ్లు, బ్రెయిలీ కిట్లు, క్రచ్‌ ఎల్బోలు, టీఎల్‌ఎం కిట్లు, వీల్‌ చెయిర్లు, వాకింగ్‌ స్టిక్‌లు, రోలటార్లు వంటి ఉపకరణాలు అందజేశారు. విద్యార్థులు బాగా చదువుకుని కెరీర్‌ పరంగా ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవాలన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటుందన్నారు. సదరం సర్టిఫికెట్లతో కొత్త పెన్షన్లు కూడా అందిస్తామన్నారు. కార్యక్రమంలో డీఈవో యూవీ సుబ్బారావు, సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ జి.మహేశ్వరరావు, సమగ్ర శిక్ష అధికారి ఎల్‌.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement