నిజామాబాద్ అర్బన్ : పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు నిఘా కొనసాగించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. బక్రీద్ను పురస్కరించుకొని శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, సీపీ మాట్లాడుతూ బక్రీద్ను దృష్టిలో పెట్టుకొని జంతు సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గోవులతోపాటు ఒంటెలు వధించకుండా నిషేధం అమలులో ఉందని తెలిపారు. దీనిపై ప్రజలకు విస్తతస్థాయిలో అవగాహన కల్పిస్తూ, గోవులు, ఒంటెలను వధించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పశువులను స్లాట ర్ హౌస్లలోనే వధించాలని, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వధించరాదని సూచించారు. పశువుల అక్ర మ రవాణాను నిరోధించేందుకు జిల్లాలోని కందకుర్తి, సాలూర, పొతంగల్, ఖండ్గావ్ అంతర్రాష్ట్ర చెక్పోస్టులతోపాటు, సాటాపూర్, యంచ, ఇందల్వా యి, ఉమ్మెడ, జన్నెపల్లి, మామిడిపల్లి తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా అంతర్ జిల్లా చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని సీపీ తెలిపారు. రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలకు చెందిన అధికారులు ని రంతరం పర్యవేక్షణ జరపాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తే వెంటనే సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువుల వారాంతపు సంతలలో నిబంధనలకు అనుగుణంగా క్రయవిక్రయాలు జరిగేలా చూడాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో బక్రీద్ వేడుక జరిగేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో అదన పు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహ తో, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర రావు, ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, పశు సంవర్ధక, పంచాయతీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సమస్యలు తలెత్తకుండా చూడాలి
కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు,
సీపీ సాయిచైతన్య


