వివాదాలకు శాశ్వత పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

వివాదాలకు శాశ్వత పరిష్కారం

Apr 24 2025 1:22 AM | Updated on Apr 24 2025 1:22 AM

వివాదాలకు శాశ్వత పరిష్కారం

వివాదాలకు శాశ్వత పరిష్కారం

రుద్రూర్‌: భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడంతోపాటు రైతులకు భూములపై పూర్తి హక్కు లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. భూ భారతి చట్టంపై మో స్రా, చందూర్‌ మండల కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో కలెక్టర్‌ పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో రైతులకు, పేదలకు మేలు కలుగు తుందని అన్నారు. భూ వివాదాల్లో కోర్టుకు వెళ్లే పే ద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందుతుంద న్నారు. అసైన్‌మెంట్‌ భూములకు సంబంఽధించి కూ డా త్వరలోనే ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయనుందని తెలిపారు. రైతుల సందేహాలను కలెక్టర్‌ నివృత్తి చేశారు. భూ భారతి చట్టంపై సలహాలు, సూచనలు చేయాలని రైతులను కోరా రు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా భూ భారతి చట్టంలోని సెక్షన్‌లను వివరించారు. బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, తహసీల్దార్‌ మారుతి, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ కె లక్ష్మ ణ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌లు సుధాకర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం

భూ భారతి పోర్టల్‌పై సలహాలు,

సూచనలు అందించాలి

అవగాహన సదస్సుల్లో

కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement