
అన్నదాతలకు ఉపయోగకరం
వ్యవసాయం లాభసాటిదే...
వ్యవసాయం రంగం సంక్షోభంలో ఉందనేది అపోహ మా త్రమే. ఎంతో మంది రైతులు వ్యవసాయాన్ని పండుగ చేసుకొని లాభసాటిగా మార్చుకున్నారు. ప్రభుత్వం కూడా పంటలు సాగు చేస్తున్న రైతులకు మద్దతు ధర, బోనస్, రుణమాఫీ లాంటి పథకాలు అందిస్తోంది. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచడానికి రైతు మహోత్సవం చక్కని వేదికగా మారింది. రైతులు కేవలం వరి పంటనే కాకుండా ఆరుతడి పంటలను పండించాలి. – జానయ్య, వీసీ,
తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ
సుభాష్నగర్/ డొంకేశ్వర్: జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవం.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. రైతు మహోత్సవం స్టాళ్లను బుధవారం ఆయన పరిశీలించారు. జిల్లాలో రైతు మహోత్సవం ఏర్పా టు చేసినందుకు సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు ప్రత్యేక ధ న్యవాదాలు తెలిపారు. రైతులు మార్కెట్లో డి మాండ్ ఉన్న పంటలతోపాటు దేశీ రకాలు, ఇతర లాభదాయకమైన పంటలను సాగు చేసి లాభాలు ఆర్జించాలని సూచించారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు చైర్మన్ను సన్మానించారు.
మేలైన విత్తనాలు అందజేస్తాం
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతులకు మేలైన విత్తనాలు అందజేస్తాం. వచ్చే ఖరీ ఫ్ సీజన్కు 10లక్షల విత్తనాలు అందజేయాలని నిర్ణయించాం. రైతులు ప్రైవేటు కంపెనీల మాయమాటలను నమ్మి హైబ్రీడ్ విత్తనాలను వేసి దిగుబడిని నష్టపోతున్నారు. దీంతో పంటలు రోగాలను తట్టుకోవడం లేదు. – అన్వేశ్రెడ్డి,
తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్

అన్నదాతలకు ఉపయోగకరం

అన్నదాతలకు ఉపయోగకరం

అన్నదాతలకు ఉపయోగకరం