భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి

Apr 23 2025 9:45 AM | Updated on Apr 23 2025 9:45 AM

భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి

భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి

బాల్కొండ: భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం ‘భూ భారతి’ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. ముప్కాల్‌ మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన ‘భూ భారతి’ అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ధరణిలో ఉన్న లోపాలను సరి చేస్తూ నూతన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఈ చట్టంలో రైతులకు ఇక్కడే న్యాయ సేవలు అందించే అంశం పొందుపరచబడి ఉందన్నారు. కోర్టుల చుట్టూ తిరగే అవకాశం లేకుండా సమస్యను పరిష్కరించుకోవచ్చన్నారు. వారసత్వ హక్కుల కోసం సాదభైనామాను సులభతరంగా చేసుకోవచ్చన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ధరణితో రైతులను దగా చేశారని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ సుంకేట్‌ అన్వేష్‌రెడ్డి ఆరోపించారు. ఆర్మూర్‌ ఆర్డీవో రాజుగౌడ్‌, మండల ప్రత్యేకాధికారి స్రవంతి, తహసీల్దార్‌ గజనాన్‌, ఎంపీడీవో ఆనంద్‌ నరేశ్‌, ఏఎంసీ ఛైర్మన్‌ ముత్యంరెడ్డి, డైరెక్టర్‌ రవి పాల్గొన్నారు.

మెండోరా మండల కేంద్రంలో..

బాల్కొండ: మెండోరా మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ పాల్గొని, మాట్లాడారు. రైతులకు భూ సమస్యలపై న్యాయ సేవలు భూభారతి చట్టం ద్వారా అందుతాయన్నారు. తహసీల్దార్‌ సంతోష్‌రెడ్డి, ఎంపీడీవో వనజ, వేల్పూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ కొత్తింటి ముత్యంరెడ్డి, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ మచ్చర్ల రాజారెడ్డి పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు

ముప్కాల్‌లో అవగాహన సదస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement