
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
పిట్లం: ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన పిట్లం మండలం సిద్ధాపూర్ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై రాజు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడకు చెందిన కె బుచ్చయ్య చారి(42) పిట్లం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి విధులు ముగించుకొని పిట్లం నుంచి బాన్సువాడకు బైక్పై వెళ్తుండగా సిద్ధాపూర్ శివారులోని చెరువు కట్ట ప్రాంతంలో ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
భిక్కనూరు: లారీని వెనుక నుంచి ఓ బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్ మండలం కల్వరాలకు చెందిన శ్రీనివాస్(42) బీబీపేటలో ఉన్న బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి బైక్పై వస్తుండగా జంగంపల్లి శివారులో రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో గురువారం అర్ధరాత్రి, శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి