నిర్మల్టౌన్: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఈ నెల 27నుంచి 29వరకు నిర్వహించనున్న వ్యాస పూర్ణిమ ఉత్సవాలకు ఎస్పీ జానకీ షర్మిలను ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఆలయ ఈవో అంజనీదేవి, స్థానాచార్యుడు ప్రవీణ్ పాఠక్, ఉప ప్రధానా చార్యుడు శ్రీపాద్ దీక్షితులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని మ ర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదా శీర్వచనాలు అందించి, వ్యాస పూర్ణిమ ఉత్సవా ల ఆధ్యాత్మిక, వైదిక విశిష్టతను వివరించారు.


