ఖానాపూర్: ఎస్ఐఆర్ నమోదులో వేగం పెంచి త్వ రగా పూర్తి చేయాలని, అర్హులైన ప్రతీ ఓటరును వంద శాతం నమోదు చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఖా నాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఎల్ఏ సూపర్వైజర్లు, ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఎస్ఐఆర్ న మోదు ప్రక్రియ పూర్తయ్యే వరకు రోజూ క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తూ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, ఎస్ఐఆర్ అబ్జర్వర్, మాజీ ఎ మ్మెల్యే ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ నమోదును విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని పి లుపునిచ్చారు. నాయకులు ఎంబడి రాజేశ్వర్, దు ర్గాభవాని, చిన్నం సత్యం, జంగిల్ శంకర్, గొర్రె గంగాధర్, గుడిసె రమేశ్, గంగన్న తదితరులున్నారు.


