
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ముధోల్: మండల కేంద్రంలోని శ్రీసరస్వతీ శిశుమందిర్ పాఠశాల విద్యార్థిని రుమ్మెల్ల యోగిత రాష్ట్రస్థాయి పరుగు పందేనికి ఎంపికైనట్లు ప్రధానాచార్యులు సారథి రాజు తెలి పారు. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించి న జిల్లాస్థాయి పరుగు పందెంలో 60 మీట ర్లు, 600 మీటర్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చి మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిని ప్రోత్సహించిన పీఈటీలు కై లాస్, శ్రీనివాస్లను పాఠశాల యాజ మాన్యం అభినందించింది. ఈ నెల 30, 31వ తేదీల్లో మహబూబ్నగర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.